Tirupati : చిత్తూరు జిల్లాలో ఈ రోజు మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలడంతో ఓ ఇన్నోవా కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అరగొండ దగ్గర బెంగళూరు-చెన్నై హైవే బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. నిన్న ఇదే రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో బస్సు, రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి, 33 మందికి తీవ్ర గాయలయ్యాయి. రెండు లారీల మధ్య ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. తీవ్రగాయాలన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోడ్డుపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ఈ మార్గంలో వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు.
Search Results for: Road Accident
Road Accident : అర్థరాత్రి ఘోర ప్రమాదం..ఏడుగురు దుర్మరణం!
Eluru District : ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తంతో తడిసిపోయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని తనలో కలిపేసుకుంది. ఈ ప్రమాదం (Road Accident) లో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు పారిపోగా..మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జీడిపిక్కల లోడుతో…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా టి .నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయల్దేరింది. ఆరిపాటి దిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపు తప్పి పంటబోదెలోకి వాహనం దూసుకెళ్లింది.
పరారీలో డ్రైవర్..
దీంతో వాహనం ఒక్కసారిగా తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది జట్టు సభ్యులు ఉండగా వారిలో డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు. వాహనం ఒక్కసారిగా తిరగపడడంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో తాడిమళ్లకు చెందిన ఘంటా మధుగా పోలీసులు గుర్తించారు.
చనిపోయినవారు ఎవరంటే…
మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డీఎస్పీ దేవకుమార్ చనిపోయిన వారి వివరాలను వెల్లడించారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి. చినముసలయ్య (35), కత్తవ ఋష్ణ (40) కత్తవ సత్తిపండు (40),తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ ఈ ఘటనలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెల్లాచెదురైన మృతదేహాలు!
Car Accident : కర్నూలు జిల్లా (Kurnool District) ఆలూరు మండలం హోలేబీడు గ్రామ సమీంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రహాదారిపై జైలో కారు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లలు స్వల్పంగా గాయాపడ్డారు. మృతుల్లో ఒక మహిళ ఉండగా.. మృతులు అదోని వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివుండటం స్థానికులను కలచివేసింది. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి (Adoni Government Hospital) కి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కారు వేగంగా వచ్చి బోల్తాపడిందా? లేక ఏదైన వెహికిల్ ఢికొట్టి వెళ్లిందా అనే కోణంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి!
East Godavari District : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దివాన్ చెరువు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో గైట్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు (B.Tech Students) అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను శ్రీకాకుళం చెందిన రోనంకి ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్ (19) గా పోలీసులు గుర్తించారు.
విద్యార్థులు బైక్ పై దివాన్ చెరువు వెళుతుండగా వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఆ జాతీయ రహదారి పై విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అలాగే మొబైల్ ఫోన్ ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి (Rajahmundry Government Hospital) కి తరలించారు.
Road Accident: కడప లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి!
Road Accident: ఖాజీపేట జాతీయ రహదారి దుంపల గట్టు టోల్ ప్లాజా సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలోనే ఒకరు మృతి చెందగా..మరొకరిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు!
Road Accident: రోడ్డు దాటుతుండగా ప్రాణాలు తీసిన అతివేగం.. వీడియో వైరల్
హైదరాబాద్లో అతివేగ ప్రయాణం ఒకరి ప్రాణాలు తీసింది. సూరారం పీఎస్ పరిధిలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఆ రోడ్డుపై అతివేగంగా వస్తున్న ఓ బైక్ అతడిని ఢీకొట్టింది. దీంతో అబ్దుల్ దాదాపు 20 మీటర్లు ఎగిరిపడ్డాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే బైక్ నడిపిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.
Also Read: ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో చెప్పండి.. తేల్చేద్దాం: పొన్నం