AP Crime: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్లో వేడి పాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి అక్షిత ప్రాణాలు కోల్పోయింది.