YCP: వైసీపీకి బిగ్ షాక్.. MLAకు నోటీసులు
పొదిలి ఘర్షణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్ రైతు పోరుబాటలో చెలరేగిన అల్లర్లపై పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి నోటీసులు పంపారు.
పొదిలి ఘర్షణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్ రైతు పోరుబాటలో చెలరేగిన అల్లర్లపై పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి నోటీసులు పంపారు.
ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ కు వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన చేయగా.. వారిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో రాళ్ల దాడి చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొల్గొన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన TDP నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న కారు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీల కార్యకర్తలకు పలు నామినేటెడ్ పోస్టులను కట్టబెడుతోంది. తాజాగా 10 జిల్లాలకు సహకార బ్యాంక్, సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఒకే రోజు ఐదుగురు పిడుగు పాటుతో మృతి చెందారు. క్రికెట్ ఆడుతుండగా ప్రకాశంలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, కడపలో ఒకరు మృతి చెందారు. వేర్వేరు జిల్లాల్లో పిడుగు పాటు వల్ల ఒకే రోజు మృతి చెందారు.
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెదఓబినిపల్లిలో క్రికెట్ ఆడుతూ ఇద్దరు పిల్లలు చనిపోయారు. వర్షం వస్తుందని చెట్టుకిందికి వెళ్లగా పిడుగు పడింది. పిడుగుపాటుకు పులుగుజ్జు సన్నీ(16), గోసిపోతల ఆకాశ్(18)లు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.