🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డయితే రాజీనామా చేయడానికి సిద్ధమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. తమ మొరను అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లైన్లోనే పనిచేస్తామని ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందన్న చర్చకు బ్రేక్ పడింది. నేడు ఎలాంటి తొలగింపులు లేకుండానే మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేశారు సీఎం రేవంత్. దీంతో సురేఖ, ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ'' ప్రజలకథే నా ఆత్మకథ'' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. నా పాఠశాల చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో, ప్రస్తుతం ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నానని ఇటీవలే ప్రధాని మోదీకి చెప్పానని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నస్వామి మెట్లదారి సమీపంలో రమణారెడ్డి అనే యువకుడిని బీరు బాటిళ్లతో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గుడి పక్కనే ఉన్న ప్రాంతంలో పూడ్చేశారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. శ్రీహరికి హోం శాఖ, వివేక్ కు విద్య, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ సంక్షేమ శాఖలను అప్పగించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు సమాచారం. సాయంత్రంలోగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తమకు అవకాశం వస్తుందని ఆశిస్తూ వస్తున్న పలువురు నేతలకు నిరాశే మిగిలింది. పదవులు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఈ రోజు జరిగింది. అయితే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న పలువురు తమకు పదవులు దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది.