ఆత్మగౌరవం పోయాక పదవులు ఎందుకు.. ఈటల సంచలన కామెంట్స్!
ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా విసిరేసిన చరిత్ర తమదన్నారు.
ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా విసిరేసిన చరిత్ర తమదన్నారు.
హైదరాబాద్లోని పలు చోట్ల వర్షం పడుతోంది. అల్వాల్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, యూసఫ్గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్పేట, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. దీంతో ఎమర్జెన్సీ టీమ్లను అధికారులు అప్రమత్తం చేశారు.
ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ గతకొన్ని రోజులు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిపై ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి వెళ్తూ.. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో మీడియాతో మాట్లాడారు.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో 7754 స్పెషల్ బస్సులను నడపడానికి నిర్ణయించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీకోని ముగ్గురు వ్యక్తులు మరణించడం కలకలం రేపింది. కొత్తమొల్గర సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోలు ఢీకొన్నాయి. గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల మరికొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వనపర్తి జిల్లా రాయికల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయికల్ రైస్ మిల్ దగ్గర ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ని హాలీవుడ్ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్మికుల కోసం ఆరోగ్య బీమా, శిక్షణ కార్యక్రమాలు, గద్దర్ అవార్డులు పునరుద్ధరణ, చిన్న చిత్రాలకు మద్దతు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.