DC vs LSG : టాస్ గెలిచిన ఢిల్లీ.. లక్నో బ్యాటింగ్!
లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.
లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. రేపు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఈ పర్యటనలో దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?
సీనియర్ IPS ఆంజనేయులు YCP హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైత్వానీని 42రోజు జుడ్యీషియల్ కస్డడీలో చిత్ర హింసలు పెట్టారని ఆమె ఆరోపించారు.YCP లీడర్ కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను వేధించారని తెలిసింది.
అప్పుడే పెళ్లైన జంట హనీమూన్ కోసమని జమ్మూ కాశ్మీర్ కు వచ్చారు. కానీ అదే వారిని వీడదీస్తుందని అనుకోలేదు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా ఉగ్రవాదులు ఆమె భర్తను పాయింట్ బ్లాక్ లో కాల్చారు. కళ్లముందే భర్త చనిపోవడం చూసిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో ఐదుగురు పర్యాటకుల మృతి చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
పశ్చిమబెంగాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ అల్లర్ల బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
హైడ్రా పనితీరు బాగుందని కుకట్ పల్లి BRS ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కితాబిచ్చారు. నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని అభినందించారు. ఈ రోజు హైడ్రా చీఫ్ రంగనాథ్ ను కలిసిన కృష్ణారావు కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అల్లు అర్జున్- అట్లీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఆదివారం ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో బన్నీ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ
మధ్యప్రదేశ్లోని దామో జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. నోహటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
వక్ఫ్ బోర్డ్కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన కొందరు దుండగులు యువకులను రెచ్చగొట్టారన్నారు.
లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు.
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు వెలువడిన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు అరుంధతి అనే అమ్మాయి మనస్థాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.