Gyanesh Kumar : కోల్‌కతాలో సీఈసీకి నిరసన సెగ.. నల్లజెండాలతో గోబ్యాక్ నినాదాలు

గతంలో ఎన్నడు లేని విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు దేశవ్యాప్తంగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. అంతేకాదు, మనదేశ చరిత్రలోనే తొలిసారిగా జ్ఞానేశ్ కుమార్‌‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు విపక్ష పార్టీలు రెడీ అవుతుండటం విశేషం.

PIB Fact Check: అది ఫేక్‌ వెబ్‌సైట్.. కేంద్రం కీలక హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం ఫేక్‌ వెబ్‌సైట్‌ల విషయంలో తాజాగా కీలక హెచ్చరికలు చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్‌ లాగే సైబర్ నేరగాళ్లు http://sarvashikshaabhiyan.com అనే వెబ్‌సైట్‌ తయారుచేశారని పేర్కొంది.

Supreme Court: యాసిడ్‌ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యాసిడ్ దాడి బాధితులకు పరిహారం కల్పించే విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

Maoist Ganapati : మావోయిస్టు గణపతి కోసం వేట...ఏ క్షణమైన...

ఆఫరేషన్‌ కగార్‌ తో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేటకు మావోయిస్టు అగ్రనాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. పలువురు కీలక నాయకులు పోలీసులు,ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ ​గణపతి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.

BREAKING: టీవీకే విజయ్‌కు బిగ్ షాక్.. సీబీఐ సమన్లు

టీవీకే చీఫ్‌ విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 10న (మంగళవారం) విచారణకు రావాలని తెలిపింది.

Tech Mahindra: టెక్‌ మహీంద్రాలో 30వేల లేఆఫ్‌లు.. క్లారిటీ !

టెక్‌ మహీంద్రాలో కూడా భారీగా లేఆఫ్‌లు జరగనున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం నడుస్తోంది. ఏకంగా 30 వేల మందిని తొలగించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇవన్ని తప్పుడు వార్తలని ఆ కంపెనీ తేల్చిచెప్పింది

Indian Stock Markets Crash: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump: 'ట్రంప్.. చిన్నారుల కళ్లలోకి చూడు'.. ఇరాన్‌ న్యూస్‌పేపర్‌ ఫస్ట్‌పేజీలో సంచలన వార్త

టెహ్రాన్ టైమ్స్‌ సంచలన కథనం వెలువరించింది. యుద్ధం మొదలైన రోజు ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ స్కూల్‌పై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల ఫొటోలను సోమవారం ఈ న్యూస్‌పేపర్‌లో మొదటి పేజీలో ప్రచూరించింది.

BIG BREAKING: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. 16 ఏళ్ల హిందూ బాలుడి హత్య

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులపై ఈ దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో హిందువును హత్య చేయడం కలకలం రేపుతోంది. ఫెనీ జిల్లాలోని కొందరు దుండగులు 16 ఏళ్ల హిందూ బాలుడిని దారుణంగా హత్య చేశారు

Iran- Israeli War : బహ్రెయిన్ చమురు శుద్ధి కర్మాగారం బాప్కోపై ఇరాన్‌ అటాక్‌..నిలిచిపోయిన ఇంధన శుద్ధి

ఇరాన్ ఈ రోజు బహ్రెయిన్‌లో ఉన్న ప్రభుత్వ అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం బాప్కో(BAPCO)ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఇరాన్‌ దాడి తర్వాత  ఆ ప్రాంతం చుట్టూ దట్టమైన పొగ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

Iran: విదేశాల్లో ఉంటున్న ఇరానీయులకు బిగ్‌ షాక్.. అలా చేస్తే మరణశిక్ష

దేశాల్లో నివసిస్తున్న ఇరాన్ పౌరులకు సంచలన ఇరాన్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడం, శత్రు దేశాలకు సహకరించిన వాళ్లకు మరణశిక్ష విధిస్తామని పేర్కొంది.

అమెరికాలో మహిళా దినోత్సవ వేడుకలు.. భారతీయ సంతతి మహిళలకు ఘనంగా సత్కారం

అమెరికాలో భారతీయ డయాస్పోరాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్' (FIA) ఆధ్వర్యంలో 8వ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

China: ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలు, మౌనం పాటిస్తున్న చైనా.. కారణాలు ఇవే !

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో చమరు ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారైన చైనా మాత్రం స్పందించడం లేదు. డ్రాగన్ మౌనం వెనుక ఉన్న కారణాలంటే ఇప్పుడు తెలుసుకుందాం.

Iran- Israeli War : 1200 మంది మృతి.. 10 వేల మందికి గాయాలు.. ఇరాన్-అమెరికా వార్ గురించి 10 షాకింగ్ విషయాలు!

ఇరాన్, ఇజ్రాయెల్,అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మానవ, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం సంభవించింది. యుద్ధం మూలంగా ఇరాన్‌లో 1,200 మందికి పైగా పౌరులు మరణించారు, వీరిలో 200 మందికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. వేలాది మంది గాయపడ్డారు.

Telangana movement : కేసీఆర్, కేటీఆర్ కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత!

తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె సమయంలో నమోదైన కేసులను నాంపల్లి కోర్ట కొట్టివేసింది. అందులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్,బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పైన నమోదైన ఓ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Crime : భర్త ప్రాణం తీసిన భార్య అక్రమ సంబంధం

భార్య మరోకరితో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాకుండా ప్రియుడితో కలసి భర్తను వేధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో జరిగిన ఈ ఘటనలో భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Kavitha : ఖమ్మం జెడ్పీసెంటర్‌లో ఉద్రిక్తత.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కవితతో పాటు ,విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Konda Surekha vs Errabelli Swarna : కొండా సురేఖ ఆధిపత్యానికి చెక్‌..రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్‌ గా ఎర్రబెల్లి స్వర్ణ

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు ఎర్రబెల్లి స్వర్ణకు అప్పగించడంతో వరంగల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వరంగల్ లో మంత్రి కొండా సురేఖ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకే జిల్లా హస్తం నేతలు హైకమాండ్ పై ఒత్తిడి చేయటంతోనే ఆమెకు పదవి దక్కినట్టు ప్రచారం జరుగుతున్నది.

Maoist Ganapati : మావోయిస్టు గణపతి కోసం వేట...ఏ క్షణమైన...

ఆఫరేషన్‌ కగార్‌ తో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేటకు మావోయిస్టు అగ్రనాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. పలువురు కీలక నాయకులు పోలీసులు,ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ ​గణపతి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.

రంగంలోకి CM రేవంత్ రెడ్డి.. మూసీ రివర్ ఫ్రంట్‌పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

మూసీ రివర్ ఫ్రంట్ పునరుజ్జీవన ప్రాజెక్టుపై నెలకొన్న అపోహలను తొలగించి, పారదర్శకతను పెంచేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెల 13న తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఈ ప్రాజెక్టుపై ఆయన పూర్తి వివరణతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Telangana: విద్యార్థినులకు ఈవీ స్కూటీలు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మారుస్తున్నామని పేర్కొన్నారు.

Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...

విజయవాడలో పోలీసులు కార్టన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్‌ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.

AP Telangana Heatwave Alert: ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 33–39°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరో 2–4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్‌

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా అటాచ్ చేసింది.

Andhra Pradesh: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

Dhulipalla Narendra: ఊసరవెల్లి.. నన్ను ఏం పీకలేవ్ రా..

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 33 రోజులు జైల్లో పెట్టినా ఒక్క తప్పు చూపించలేకపోయారని, తిరుమల లడ్డూ కల్తీ, నెయ్యి అక్రమాలు లాంటి సమస్యలన్నీ వైసీపీ నేతల వల్ల జరిగాయని అన్నారు.

Home Minister Anitha: హోం మంత్రి అనితకు అస్వస్థత: ఆస్పత్రికి తరలింపు

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శాసనసభ సమావేశాల్లో చర్చ సాగుతుండగా ఆమె ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమై.. ఆమెను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు.

Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్‌ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్‌ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది.

BREAKING: పశ్చిమాసియాలో యుద్ధం.. 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరిన బంగారం విలువ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బంగారం విలువ ఏకంగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత్‌, యూకే దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Indian Stock Markets Crash: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.

Crude Oil: భగ్గుమంటున్న చమురు ధరలు.. 100 డాలర్లు దాటిన బ్యారెల్

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం రెండో వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్కును దాటేసింది.

Gold Discounts: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.

Summer Sale AC Offers: సమ్మర్ సేల్‌లో రూ.20 వేలకే ఏసీ.. అదిరిపోయిన ఆఫర్లు

ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి లాయిడ్ (Lloyd) 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ధర రూ. 47,990 ఉంది. అయితే సమ్మర్ సేల్‌లో భాగంగా అమెజాన్ సుమారు 50 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీనిని కేవలం రూ. 22 వేలకే మీరు సొంతం చేసుకోవచ్చు.

ఇండియాలో కుప్పకూలిన కోడి గుడ్డు ధర.. రోజుకు రూ. 5 కోట్ల నష్టం!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గగనతల, సముద్ర మార్గాలపై ఆంక్షలు విధించారు. దీంతో మార్చి 1 నుండి నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి సుమారు కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీల్లోనే నిలిచిపోయాయి.

Samsung Galaxy S26: 10-బిట్ డిస్‌ప్లే లేదు.. సామ్‌సంగ్ క్లారిటీ!

Samsung Galaxy S26 సిరీస్‌లో 10-బిట్ డిస్‌ప్లే లేదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. మూడు మోడళ్లలో కూడా 8-బిట్ డిస్‌ప్లేనే ఉంది. కానీ FRC టెక్నాలజీతో స్క్రీన్ కలర్ క్వాలిటీ మెరుగుపరిచారు. అధిక ధర ఉన్న ఈ ఫోన్లలో 10-బిట్ లేకపోవడం కొంతమంది వినియోగదారులకు నిరాశ కలిగించింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->