🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఉత్తరప్రదేశ్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని కొందరు ఆడ దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు పదిమంది మహిళా దొంగలను అరెస్టు చేశారు.
అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ యువతిని చంపి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పీఎస్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితురాలి తల్లి వాపోయారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నస్వామి మెట్లదారి సమీపంలో రమణారెడ్డి అనే యువకుడిని బీరు బాటిళ్లతో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గుడి పక్కనే ఉన్న ప్రాంతంలో పూడ్చేశారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్ లోని హెచ్.పి పెట్రోల్ బంక్ సమీపంలో రెండు బైకులు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం బైక్ పై ప్రయాణిస్తున్న రత్నం అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమసంబంధం ఘటన సంచలనం రేపింది. కర్నాటకకు చెందిన హరితో గాయత్రి లేచిపోయింది. 15రోజులకు తిరిగి రావడంతో భర్త పంచాయతీ పెట్టించి, పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. ఆపై హరి వర్గంపై గాయత్రి భర్త దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అల్లూరి జిల్లా అరకు లోయలోని ఏజెన్సీ ప్రాంతంలోని డుంబ్రిగూడ మండలం గుంటసీమ దగ్గర కొంతమంది బాలురు ఈతకు వెళ్లారు. అయితే చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండటం, లోతు కూడా ఉండటంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి చనిపోయారు.
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో యువకున్ని పట్టుకుని చితకబాదారు.
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా NH 44 జాతీయ రహదారిపై లారీలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ లారీల వెనుక వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.