🔴Live News Updates: ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Also Read: ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. టూరిస్టుల మీద విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. ప్రపంచమంతా ఆ దాడిని ఖండించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్..పాక్ పై దాడులు చేపట్టింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. తర్వాత పాక్ కూడా కాల్పులు నిర్వహించింది. తరువాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఘటనపై అమెరికా ఇప్పుడు మళ్ళీ స్పందించింది.

Also Read: ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థే..

పహల్గాందాడిని తామే చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే గ్రూప్ ప్రకటించింది. పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఆధ్వర్యంలో ఇది పని చేస్తోంది. అయితే ఈ దాడి ముందు వరకు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు అమెరికా ఈ టీఆర్ఎఫ్ ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో చెప్పారు. ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌’ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్నట్లు తెలిపారు.  

Also Read: షాకింగ్ వీడియో.. పాముని మెడలో వేసుకుని పోజులు.. ఒక్క కాటుతో ప్రాణాలే పోయాయ్

2008 తర్వాత భారత్ లో ముంబయ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన అతి పెద్ద అటాక్ పహల్గామేనని మార్క్ రూబియో అధికారిక ప్రకటన చేశారు. అలాగే అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇది తమ పరిపాలన నిబద్ధత అని చెప్పారు. 

Also Read: మా సంగతి మేం చూసుకుంటాం..నాటో చీఫ్ కు భారత్ ఘాటు సమాధానం

  • Jul 18, 2025 11:23 IST

    Bangladesh: ముజీబ్, ఠాగూర్, ఇప్పుడు సత్యజిత్ రే..భారత్ తో బంగ్లాదేశ్ తెగతెంపులు చేసుకుంటోందా?

    బంగ్లాదేశ్ తన గతాన్ని,సాంస్కృతిక చరిత్రను ,భారతదేశంతో తన భాగస్వామ్య వారసత్వాన్ని వదులుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముజీబ్, ఠాగూర్ల ఇళ్ళ తర్వాత ఇప్పుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేత తో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

     

    bangla
    Mujib, Tagore, Satyajit Ray

     



  • Jul 18, 2025 11:23 IST

    Assam CM: రాహుల్ కోసం అస్సాం జైళ్ళు వెయిటింగ్..విరుచుకుపడ్డ సీఎం హిమంత బిస్వా

    అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ జైలుకు వెళ్తారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు దానిపై హిమంత స్పందించారు.  రాహుల్ కోసం అస్సాం జైళ్ళు ఎదురు చూస్తున్నాయని అన్నారు. ఆయన ప్రసంగాల వలన ఆక్రమణదారులు పోలీసులపై దాడి చేశారని చెప్పారు.

     

    himantha
    Assam CM Himantha Biswa Sarma

     



  • Jul 18, 2025 09:42 IST

    USA: ట్రంప్ లో ఆ లోపం ఉంది..వైట్ హౌస్

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 70పైనే ఉంటుంది.  దీంతో ఆయన దీర్ఘకాల సిరల వ్యాధి వీనస్ ఇన్ సఫీషియన్స్ తో బాధపడుతున్నారు. అయితే ఇది సాధారణ వ్యాదేనని..కంగారుపడవలసిన అవసరం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటించారు. 

     

    trump health
    White House Announcement On Trump Health

     



  • Jul 18, 2025 09:42 IST

    Cricket: మరో 101 పరుగులు చేస్తే..61 ఏళ్ళ రికార్డ్ రిషబ్ సొంతం

    ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ లలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ దంచికొడుతున్నాడు. ప్రస్తుతం 425 రన్స్ తో సెకండ్ లీడ్ స్కోరర్ గా ఉన్న పంత్..మరో 101 పరుగులు చేస్తే ఒక టెస్ట్ సీరీస్ లో అత్యధిక రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా నిలుస్తాడు. 

     

    Rishabh Pant
    Rishabh Pant Photograph: (Rishabh Pant)

     



  • Jul 18, 2025 09:40 IST

    AAIB: ఏం జరిగిందో చెప్పాం..దర్యాప్తు ఇంకా పూర్తవలేదు..ఏఏఐబీ

    ఇంధన స్విచ్ లు ఆఫ్ అయ్యాయంటూ ఏఏఐబీ ప్రథమిక దర్యాప్తు ఇచ్చింది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో విపరీత కథనాలు వచ్చాయి. పైలెటే స్విచాఫ్ చేశాడంటూ రాశాయి. దీంతో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని..అప్పుడే నిర్ధారణకు రావొద్దంటూ ఏఏఐబీ స్పష్టం చేసింది. 

     

    Air India Crash victims' families claim forced financial disclosures
    Air India Crash victims' families claim forced financial disclosures

     



  • Jul 18, 2025 09:39 IST

    USA: ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

    పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ విషయంలో అమెరికా కీల నిర్ణయం తీసుకుంది. దానిని ఉగ్రవాద సంస్థ అని ప్రకటించింది. లష్కరే తోయిబా ముసుగులో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ అని చెప్పింది. 

     

    Trump
    Trump

     



  • Jul 18, 2025 08:02 IST

    BIG BREAKING: సిద్ధరామయ్య కన్నుమూత.. షాకింగ్ పోస్ట్

    కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. సీనియర్‌ నటి సరోజాదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె భౌతికకాయానికి సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించిన పోస్ట్ ఫేస్‌బుక్‌తో అప్‌లోడ్ చేశారు. దాన్ని మెటా తప్పుగా ట్రాన్స్‌లేట్ చేసింది.

     

    CM Siddaramaiah
    CM Siddaramaiah

     



  • Jul 18, 2025 08:01 IST

    ఢిల్లీ కోర్టులో వింత శిక్ష.. ఏంటో తెలిస్తే షాక్!

    కోర్టు సమయాన్ని వృదా చేసినందుకు నలుగురికి న్యాయమూర్తి తగినబుద్ధి చెప్పారు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు నిందితులకు ఢిల్లీ న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. చేతులు పైకెత్తి కోర్టు హాలులో రోజంతా నిలబడాలని ఆదేశించింది.

    Delhi High Court



  • Jul 18, 2025 08:01 IST

    Telangana Rain Update: తెలంగాణలో జోరువాన.. ఈ జిల్లాల్లో దంచికొట్టేస్తుంది

    తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. రాబోయే 2 గంటలు ఆగకుండా మధ్యస్తంగా నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాలలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

     

    Telangana Rain Update (1)
    Telangana Rain Update

     



  • Jul 18, 2025 07:03 IST

    Ind Vs Eng: టీమిండియాకు బిగ్ షాక్.. అర్ష్‌దీప్ సింగ్ ఔట్!

    ఇంగ్లాండ్‌తో నాలుగోటెస్టుకు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తుండగా చేతివేలికి గాయమైంది. దీంతో అతని టెస్టు అరంగేట్రంపై సందిగ్ధత నెలకొంది. బుమ్రాకు విశ్రాంతిస్తే అర్ష్‌దీప్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది.

     

    arshdeep singh injured ahead of 4th test team india fast bowler
    arshdeep singh injured ahead of 4th test team india fast bowler

     



  • Jul 18, 2025 07:02 IST

    Snake Bite: షాకింగ్ వీడియో.. పాముని మెడలో వేసుకుని పోజులు.. ఒక్క కాటుతో ప్రాణాలే పోయాయ్

    మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ దీపక్ మహావర్ పాము కాటుకు గురై మరణించాడు. వేలాది పాములను రక్షించి, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో దీపక్ మహావర్ పేరుపొందాడు. ప్రజలకు సేవ చేసిన ఆయన మరణం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

     

    Deepak Mahawar died after being bitten by snake in Madhya Pradesh
    Deepak Mahawar died after being bitten by snake in Madhya Pradesh

     



  • Jul 18, 2025 07:01 IST

    Road Accident: ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

    హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదిభట్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పెద్దఅంబర్‌పేట్ నుంచి బెంగుళూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



Advertisment
Advertisment
తాజా కథనాలు