/rtv/media/media_files/2025/07/18/son-killed-mother-illicit-relationship-2025-07-18-17-23-22.jpg)
Son Killed Mother - Illicit Relationship
AP Crime: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ గొల్లవానికుంటలో నివాసం ఉండే శారధ (37) అనే మహిళను ఆమె కొడుకు హత్య చేశాడు. చిత్తూరు జిల్లా, రొంపిచర్ల మండలం, మోటమల్లెల పంచాయతీ,నగరి గ్రామానికి చెందిన శారదకు తిరుపతి జిల్లా,చిన్నగొట్టిగల్లు మండలం, కోటబైలు పంచాయతీ,నల్లఓబులవారిపల్లి గ్రామానికి చెందిన సురేష్ తో వివాహమైంది. కాగా భర్త సురేష్ గత కొంతకాలంగా కువైట్లో పనిచేస్తున్నాడు.
Also Read: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో
Also Read:Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!
Son Killed Mother - Illicit Relationship
శారధ తన ఇద్దరు కుమారులతో కలిసి గొల్లవానికుంటలో నివాసం ఉంటుంది. కాగా శారధ రేణిగుంట రోడ్డులోని మారుతీ షోరూమ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తోంది. రోజు విధులకు వెళ్లి వస్తోంది.ఈ క్రమంలోనే తల్లి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన కొడుకు శారధపై పిడిగుద్దులతో దాడి చేసి , గొంతు నులిమి హత్య చేశాడు. బంధువులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామనిఅలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు.
Also Read: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా
Also Read: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!
chitoor-district | mother-died | son | crime news | telugu crime news | thirupathi | relationship