Revanth Vs Chandrababu: మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డొస్తే.. చంద్రబాబుకు సీఎం రేవంత్ స్ట్రెయిట్ వార్నింగ్!

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం.. వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని హెచ్చరించారు.

New Update
Chandrababu Vs Revanth Reddy

పాలమూరు జిల్లా అంటే కేసీఆర్ కు చిన్నచూపని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రోజు జటప్రోలులో జరిగిన “ప్రజా పాలన- ప్రగతి బాట” సభలో ఆయన మాట్లాడారు. పాలమూరులో ఊరు లేకపోయినా.. పార్లమెంట్ లో నోరు ఎత్తకపోయినా.. ఈ జిల్లా ప్రజలు కేసీఆర్ ను పార్లమెంట్ కు పంపించారన్నారు. గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్ ఇచ్చింది ఏంటి? అన్న ప్రశ్నకు నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. 98 జీవో ప్రకారం పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నిర్వాసితులను ఎందుకు ఆదుకోలేదు? అని ప్రశ్నించారు. వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. దేళ్లలో ఈ సమస్యలను పరిష్కరించి ఉంటే పాలమూరు వాసులు మళ్లీ సమస్యపై కొట్లాడే పరిస్థితి ఉండేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన చూసి కేసీఆర్ కు ఏడుపు వస్తోందని ఎద్దేవా చేశారు. పాలమూరు గడ్డ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయిండని నీకు దుఃఖం వస్తుందా? అని ప్రశ్నించారు. బలహీన వర్గాల పిల్లలు చదువుకునేందుకు 25 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? అని ధ్వజమెత్తారు.

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

పదేళ్లు సీఎం గా ఉండి పాలమూరు ప్రాజక్టులను కేసీఆర్ పడావు పెట్టాడన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్లల్లో కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. పదేళ్లు నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారని.. కానీ, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్.. తెచ్చింది కాంగ్రెస్ .. కొనసాగిస్తున్నది కాంగ్రెస్ అని అన్నారు. వరికి బోనస్ ఇచ్చి ప్రతీ గింజ కొంటున్నామన్నారు. మొదటి ఏడాదిలోనే రూ. 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమదన్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతులకు రైతు భరోసా ఇచ్చింది మేం కాదా? అని ప్రశ్నించారు. 

రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రజల్లోకి వెళ్లి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే కడుపు మంటతో వాళ్లకు దుఃఖం వస్తుందన్నారు. కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదన్నారు. ఆడబిడ్డలను ప్రోత్సహించి కోటీశ్వరులను చేయాలన్న ప్రయత్నం తమదన్నారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి రుణాలు అందిస్తున్నామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యత ఆడబిడ్డలకే అప్పగించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేసి ఆడబిడ్డల్ని వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

సోలార్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రోత్సహించి అంబానీ అదానీతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అప్పగించామన్నారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఈ 18 నెలల్లో రూ.6500 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మాదన్నారు. ఏడాదిన్నరలోగా ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మళ్లీ ఇక్కడికి వచ్చి స్కూల్ ను ప్రారంభిస్తానని ప్రకటించారు.

Also Read:ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

2034 వరకు నేనే సీఎం..

2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరుతున్నానన్నారు. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనివ్వండంటూ విజ్ఞప్తి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం.. వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసన్నారు. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా పాలమూరును అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. 

chandrababu | telugu breaking news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు