Telangana: ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి
మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.
మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.
సిద్దిపేట జిల్లా అక్బర్పేట- భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే రజిత తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో సర్పంచ్ పదవికి లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికైంది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచ్లను తన ఫామ్ హౌస్కు ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్,వార్డు మెంబర్లకు సన్మానం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హత్నూర మండలం బోరపట్ల గ్రామ సమీపంలో ఉన్న అపిటోరియా యూనిట్ వన్ పరిశ్రమలోని ఈటీపీ ప్లాంట్లో శనివారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
సంగారెడ్డి జిల్లా కందిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎనిమిదేళ్ల బాలుడి హృదయం తల్లి చావుని కళ్లారా చూసి కకావికళమైంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. 300 క్వింటాళ్ల పత్తి మంటల్లో కాలిపోయింది. తన పంట కాలిపోవడాన్ని చూసి రైతు పడిన ఆవేదన అందర్ని కంటతడి పెట్టిస్తోంది.
సాధారణంగా కొందరికి పాములంటే భయం, ఇంకొందరికి కప్పలు, తేల్లు అంటే భయం ఉంటుంది. వాటిని చూడగానే అమ్మో అంటూ పరుగులు పెడుతుంటారు. అయితే అదే భయం కొందరిలో ఫోబియాకి దారితీస్తుంది. దీని కారణంగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.