విద్యార్థులకు త్రికోణమితి పాఠాలు చెప్పిన మెదక్ కలెక్టర్.. వీడియోలు వైరల్!
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ విద్యార్థులకు త్రికోణమితి పాఠాలు బోధించారు. నిన్న చేగుంట మండలం వడియారం స్కూల్ పరిశీలనకు కలెక్టర్ వెళ్లారు. టెన్త్ విద్యార్థులను ప్రశ్నలు అడిగి పరీక్షించారు. అనంతరం వారికి స్వయంగా పాఠాలు బోధించి సందేహాలు నివృత్తి చేశారు.