TG News: అయ్యో పాపం! పెళ్ళైన 14 రోజులకే వరుడు మృతి.. ఏమైందంటే
మెదక్ జిల్లా అంసానిపల్లిలో పెళ్ళైన 14 రోజులకే నవవరుడు సాయి కిరణ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయాన్నే లేచి స్నానం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయికిరణ్ కి గతనెల 21న అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది.