Four Maoists killed : మధ్యప్రదేశ్‌ బాలాఘాట్ లో ఎన్‌కౌంటర్‌ నలుగురు మావోయిస్టులు మృతి

దేశవ్యాప్తంగా వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

Manipur weapons operation : మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా400 ఆయుధాలు స్వాధీనం

నిత్యం అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసను తగ్గించేందుకు పోలీసులు స్పెషల్‌ ఆఫరేషన్‌ నిర్వహించారు.ఈ ఆఫరేషన్‌లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యాధునిక ఆయుధాలతో పాటు 400 లకు పైగా వివిధ రకాల ఆయుధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  

G7 Summit: జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 16,17న కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు.

Air India Flight Crash: ఇంధనం కలుషితమైందా? పక్షి ఢీకొట్టిందా?: ఫ్లైట్ యాక్సిడెంట్‌కు 8 షాకింగ్ కారణాలివే!

అమ్మదాబాద్‌లో ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఇంజన్ ఫెయిల్ అవ్వడమో, ఫక్షులు ఢీకొట్టడమో, పైలట్ తప్పిదమో అయి ఉండవచ్చు. ఫ్లైట్ టేకాఫ్ సమయం చాలా కీలకం. ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన మొత్తం విమాన ప్రమాదాల్లో 35 శాతం టేకాఫ్ టైంలోనే సంభవించాయి.

Vijay Rupani : రెండుసార్లు టికెట్‌ రద్దు చేసుకుని..మూడోసారి మృత్యుముఖంలోకి..

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించిన విషయం తెలిసిందే. ఆయితే లండన్ వెళ్లేందుకు ఆయన రెండుసార్లు టికెట్ బుక్ చేసుకుని ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. కానీ మూడోసారి లండన్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించారు.

BIG BREAKING: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమానానికి ఇకపై ఆ నెంబర్ ఉండదు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్‌ని భవిష్యత్‌లో విమానాకు కేటాయించకుడదని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా AI 159 నెంబర్‌ను ఈ ఫ్లైట్‌కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Web Stories
web-story-logo Rudraksha వెబ్ స్టోరీస్

వర్క్‌ని బట్టి రుద్రాక్ష.. వృత్తిలో గెలుపు మీదే..!!

web-story-logo Birds Migration వెబ్ స్టోరీస్

వలస పక్షుల దారి వెనుక కారణం తెలుసా..?

web-story-logo hibiscus plant వెబ్ స్టోరీస్

ఈ మొక్క ఇంట్లో పెంచితే డబ్బులే డబ్బులు

web-story-logo green almonds వెబ్ స్టోరీస్

పచ్చి బాదంపప్పుతో ఆ సమస్యలు వస్తాయా.?

web-story-logo mobile offers 8 వెబ్ స్టోరీస్

Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌పై భారీ డిస్కౌంట్!

web-story-logo Asafoetida Water వెబ్ స్టోరీస్

రాత్రి ఈ నీరు తాగితే ఆ సమస్య పరార్

web-story-logo Braided Hair వెబ్ స్టోరీస్

జుట్టును రక్షించుకోవడానికి గొప్ప మార్గం

web-story-logo Walking Benefits వెబ్ స్టోరీస్

ఎక్కువ వాకింగ్ అవసరమా.?

web-story-logo Ice Cream వెబ్ స్టోరీస్

శరీరం చల్లబడాలంటే ఐస్‌క్రీం తినాలా..?

web-story-logo vivo v50 3 వెబ్ స్టోరీస్

అరాచకమైన ఆఫర్.. Vivo V50 ఫోన్‌పై రూ.4500 డిస్కౌంట్!

Advertisment

Fire Accident: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

దుబాయ్‌లోని మెరినా టవర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్‌ అలారమ్ సిస్టమ్‌ను ఆన్‌ చేసినప్పటికీ అది పనిచేయలేదు. దీంతో పొగలు రావడంతో ఆ భవనంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.

Israel: ఇరాన్‌ను నాశనం చేస్తాం.. ఇజ్రాయెల్‌ సంచలన హెచ్చరిక

ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్‌ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు.

Israel-Iran War: భీకర యుద్ధం.. ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు మృతి

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయినట్లు తెలుస్తోంది.

Israel-Iran War: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!

ఇరాన్ దగ్గరున్న ఈ 5 ఆయుధాలతో ఇజ్రాయిల్ భయపడుతుంది. రక్షణ వ్యవస్థలో బలమైన ఇజ్రాయిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఫతా క్షిపణి, అబూ మహదీ క్షిపణి, షాహెద్ 136, మొహజీర్-10 డ్రోన్, ఫతే-110 క్షిపణి ఆయుధాలు ఇవే.

Iran Israel war: ఇరాన్ ప్రతీకార దాడులు.. ఇరు దేశాల్లో శవాల గుట్టలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం ఉదయం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అణుస్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌‌తో దాడి చేసింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి చేసినట్లు ఇరాన్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Russia Earthquake: 6.5 తీవ్రతతో భారీ భూకంపం.. ప్రాణాలు గుప్పెట్లో పరుగో పరుగు

రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 12 కి.మీ (7.46 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది.

Advertisment

Gaddar Film Awards : అంగరంగ వైభవంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇవాళ (శనివారం) సాయంత్రం ఈ వేడుక ఘనంగా మెుదలైంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు.

Crime: విషాదం.. భవనంపై నుంచి దూకిన మహిళ మృతి

హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్‌మెట్‌ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది.

Local elections : స్థానిక ఎన్నికల ఎఫెక్ట్‌...ఆ మూడు పథకాల అమల్లో జోరు

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రభుత్వం రైతుభరోసాను అమలు చేయనుంది. దీనితో పాటు రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో కూడా వేగం పెంచాలని అధికారులను ఆదేశించింది.

Danam Nagender VS Vijaya Reddy : దానం వర్సెస్‌ విజయారెడ్డి..కాంగ్రెస్‌లో రచ్చరచ్చ

ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమావేశం బంజారా హిల్స్‌ లేక్‌ వ్యూలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మోల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి కంటే.. కిరణ్ కుమార్ రెడ్డి చాలా బెటర్ : కవిత

కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో విద్యార్థి నాయకులు చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్సీ కవిత జాగృతిలోకి ఆహ్వానించింది. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో చివరి CM కిరణ్ కుమార్ రెడ్డి కంటే బలహీనంగా లేరని ఆమె అన్నారు.

TG Crime: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‌లో 80 మంది..!!

ఖమ్మం జిల్లా మర్రిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుండి ఇల్లందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్‌తో కూడిన యాష్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆర్టీసీ కండక్టర్ సహా కనీసం పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

Advertisment

DSC Exams: బిగ్ అలర్ట్.. డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు

ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

Amaravati: అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు...మళ్లీ మిన్నంటిన ఆందోళనలు

ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు.

Digital Arrest: మరో డిజిటల్‌ అరెస్ట్‌.. రూ.13.50లక్షలు దోపిడీ

సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సైబర్‌ కేటుగాళ్లకు బలై ఓ లేడి డాక్టర్‌ రూ.13.50 లక్షలు పోగొట్టుకుంది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Fire Accident in Kurma Village : అగ్నికి అహుతైన కూర్మగ్రామం..నిప్పు పెట్టిన దుండగులెవరో?

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని అధ్యాత్మిక కూర్మగ్రామం అగ్నికి అహుతైంది. గ్రామంలోని ఆధ్యాత్మిక మందిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ నెల 10న రాత్రి  అకస్మాత్తుగా మంటలు చెలరేగి వర్ణాశ్రమ కృష్ణమందిరం పూర్తిగా దగ్ధమైంది.

AP Crime: ఏపీలో దారుణం.. తమ్ముణ్ణి వేట కొడవలితో నరికి చంపిన అన్న

అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత తమ్ముణ్ణి వేట కొడవలితో గొంతు కోసి, నరికి హత్య చేశాడు అన్న. ఇల్లుని తనపేరుపై రిజిస్టర్‌ చేయించాలని గొడవ పడడంతో సొంత అన్న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

YCP: వైసీపీకి బిగ్ షాక్.. MLAకు నోటీసులు

పొదిలి ఘర్షణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్‌ రైతు పోరుబాటలో చెలరేగిన అల్లర్లపై పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి నోటీసులు పంపారు.

Advertisment

BIG BREAKING: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమానానికి ఇకపై ఆ నెంబర్ ఉండదు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్‌ని భవిష్యత్‌లో విమానాకు కేటాయించకుడదని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా AI 159 నెంబర్‌ను ఈ ఫ్లైట్‌కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Today Gold Rates: రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!

HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.

Gold Price: మరోసారి లక్ష దాటినా బంగారం ధర!

బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర  రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది. 

Stock Market: రెడ్ జోన్ లో స్టాక్ మార్కెట్లు..ఫ్లాట్ గా ట్రేడింగ్

 దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.

Online Payments: ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!

ఇటీవల యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. UPI లావాదేవీలపై ట్యాక్స్ లేదా ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment