/rtv/media/media_files/2025/04/22/8MLy0IWUmwC4FqjjuAQ5.jpg)
Stock Market Today
బుధవారం భారత ఈక్విటీ బెంచ్మార్క్లు ఫ్లాట్గా ముగిశాయి. ఈ ప్రభావం ఈరోజు మీద కూడా పడింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ క్షీణతతో ప్రారంభం అయ్యాయి. న్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 స్థాయిలో ట్రేడవుతోంది. 30 సెన్సెక్స్ స్టాక్లలో 20 నష్టపోగా.. 10 పెరిగాయి. ఈరోజు ఐటీ, ఆటో స్టాక్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లనే సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న జూన్ 11న స్టాక్ మార్కెట్ కాస్త లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 82,515 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 37 పాయింట్లు పెరిగి 25,141 వద్ద ముగిసింది.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్లు..
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.71% తగ్గి 38,149 వద్ద, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 0.46% తగ్గి 24,255 వద్ద ముగిశాయి. కొరియా కోస్పి 0.67% పెరిగి 2,926 వద్ద, చైనా షాంఘై కాంపోజిట్ 0.8% పెరిగి 3,405 వద్ద స్థిరపడ్డాయి. జూన్ 11న అమెరికా డౌ జోన్స్ 42,865 వద్ద స్థిరంగా ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 0.50% అండ్ S&P 0.27% పడిపోయాయి.
Also Read: Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి
sensex-today | nifty | today-latest-news-in-telugu | latest-telugu-news | today-news-in-telugu | business news telugu | telugu business news