/rtv/media/media_files/2025/06/14/Nf5Y65At3zR98c79rIxz.jpg)
mother in law died after hearing news of son in laws death in telangana
తెలంగాణలోని మెదక్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అల్లుడు గుండెపోటుతో మరణించిన వార్త విని అత్త షాక్కు గురై గుండెపోటుతో మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. దీంతో ఒకే ఇంట్లో అల్లుడు, అత్త మృతి తీవ్ర విషాదం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!
Also Read : KESARI CHAPTER 2: ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!
అల్లుడి మృతి విని అత్త
సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన వెంకట రమణకు(40) హవేలీ ఘనపూర్కు చెందిన మాజీ సర్పంచ్ అయ్యవారి వెంకన్న అన్నయ్య కుమార్తె నాగ శృతితో వివాహం జరిగింది. వీరు మెదక్లో నివాసం ఉంటున్నారు. ఇక వెంకట రమణ మెదక్ డిగ్రీ కాలేజీలో రికార్డు అసిస్టెంట్గా పని చేసేవాడు. నెల క్రితమే గజ్వేల్ డిగ్రీ కాలేజీకి ట్రాన్సఫర్ అయ్యాడు.
జూన్ 12న గురువారం రాత్రి వెంకట రమణకు గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే సమీప హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంటక రమణ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మృతుడు వెంకట రమణ మామ వెంకన్న.. తన భార్య ఇందిరా(48)కు సమాచారం అందించాడు.
ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!
దీంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురైంది. అనంతరం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ రెండు విషాదాలతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. అనంతరం అల్లుడు వెంకట రమణ మృతదేహం, ఇందిరా మృతదేహం ముత్తాయి పల్లికి తరలించారు.
Also Read : 6.5 తీవ్రతతో భారీ భూకంపం.. ప్రాణాలు గుప్పెట్లో పరుగో పరుగు
medak crime | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | telugu crime news | telangana crime case | telangana crime incident | telangana-crime-updates