/rtv/media/media_files/2025/06/14/oZvpwadCEJsfenUahaII.jpg)
PM Narendra Modi to take part in G7 Summit in Canada, visit Cyprus, Croatia
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్ 15,16 తేదీల్లో పర్యటన చేయనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కావడం విశేషం. అక్కడ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
Also read: ఇంధనం కలుషితమైందా? పక్షి ఢీకొట్టిందా?: ఫ్లైట్ యాక్సిడెంట్కు 8 షాకింగ్ కారణాలివే!
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, మధ్యధరా ప్రాంతంలో సంబంధాలు పెంచుకోవడం, యూరోపియన్ యూనియన్లతో సంబంధాలు మరింత పటిష్టం చేసేలా భారత్, సైప్రస్ మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి మోదీ నేరుగా కెనడా వెళ్తారు. జూన్ 16,17న ఆయన అక్కడ జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు. అయితే జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి.
Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!
జీ7 దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధినేతలతో సాంకేతికత, ఆవిష్కరణలు, ఇంధన భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం, ఇతర కీలక అంతర్జాతీయ సమస్యల గురించి చర్చలు నిర్వహించనున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్తారు. అయితే క్రొయేషియాలో ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి.
Also Read: రెండుసార్లు టికెట్ రద్దు చేసుకుని..మూడోసారి మృత్యుముఖంలోకి..
Also read: 6.5 తీవ్రతతో భారీ భూకంపం.. ప్రాణాలు గుప్పెట్లో పరుగో పరుగు