🔴LIVE BREAKINGS: 11A సీటు మిస్టరీ.. విమాన ప్రమాదంలో ఒకడు కాదు ఇద్దరు బతికారు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

 

Live Breakings

  • Jun 14, 2025 21:47 IST

    Amaravati: అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు...మళ్లీ మిన్నంటిన ఆందోళనలు

    ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు.

    Amaravathi



  • Jun 14, 2025 21:47 IST

    DSC Exams: బిగ్ అలర్ట్.. డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు

    ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

    DSC Exam dates changed in Andhra Pradesh
    DSC Exam dates changed in Andhra Pradesh
     

     

     



  • Jun 14, 2025 21:46 IST

    Crime: విషాదం.. భవనంపై నుంచి దూకిన మహిళ మృతి

    హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్‌మెట్‌ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది.

    Death
    Death

     



  • Jun 14, 2025 17:57 IST

    ఇందనం కలుషితమైందా? పక్షి ఢీకొట్టిందా?: ఫ్లైట్ యాక్సిడెంట్‌కు 8 షాకింగ్ కారణాలివే!

    అమ్మదాబాద్‌లో ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఇంజన్ ఫెయిల్ అవ్వడమో, ఫక్షులు ఢీకొట్టడమో, పైలట్ తప్పిదమో అయి ఉండవచ్చు. ఫ్లైట్ టేకాఫ్ సమయం చాలా కీలకం. ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన మొత్తం విమాన ప్రమాదాల్లో 35 శాతం టేకాఫ్ టైంలోనే సంభవించాయి.

    Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts
    Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts

     



  • Jun 14, 2025 17:51 IST

    Rahul Ramakrishna: డైరెక్టర్ గా మారిన స్టార్ కమెడియన్! సినిమాలో నటించేందుకు మీకూ ఛాన్స్

    కమెడియన్ రాహుల్ రామకృష్ణ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాహుల్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దర్శకుడిగా తన తొలి ప్రాజెక్ట్ మొదలు పెట్టానని.. ఆసక్తి గల నటీనటులు తమ షోరీల్స్‌, ఫొటోలను సంబంధింత మెయిల్ కి పంపించగలరని తెలిపాడు.

    Rahul Ramakrishna emerging as director
    Rahul Ramakrishna emerging as director

     



  • Jun 14, 2025 17:09 IST

    Vijay Rupani : రెండుసార్లు టికెట్‌ రద్దు చేసుకుని..మూడోసారి మృత్యుముఖంలోకి..

    అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించిన విషయం తెలిసిందే. ఆయితే లండన్ వెళ్లేందుకు ఆయన రెండుసార్లు టికెట్ బుక్ చేసుకుని ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. కానీ మూడోసారి లండన్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించారు.

    Former Gujarat CM Vijay Rupani On Board Flight To London
    Former Gujarat CM Vijay Rupani On Board Flight To London

     



  • Jun 14, 2025 16:45 IST

    BIG BREAKING: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమానానికి ఇక ఆ నెంబర్ ఉండదు

    అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్‌ని భవిష్యత్‌లో విమానాకు కేటాయించకుడదని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా AI 159 నెంబర్‌ను ఈ ఫ్లైట్‌కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

    Air India
    Air India

     



  • Jun 14, 2025 16:28 IST

    NEET Score Scam: నీట్ స్కోర్ పై సంచలన నిర్ణయం..సీబీఐ అదుపులో నిందితులు

    నీట్‌ యూజీ (NEET UG 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఇదిలా ఉండగానే ముంబైలో నీట్‌ స్కోర్‌ బాగోతం వెలుగు చూసింది. నీట్ స్కోర్‌లను తారుమారు చేసి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరినీ సీబీఐ అరెస్ట్ చేసింది.

    Neet Ug Exam
    Neet Ug Exam

     



  • Jun 14, 2025 16:13 IST

    AP Crime: ఏపీలో దారుణం.. తమ్ముణ్ణి వేట కొడవలితో నరికి చంపిన అన్న

    అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత తమ్ముణ్ణి వేట కొడవలితో గొంతు కోసి, నరికి హత్య చేశాడు అన్న. ఇల్లుని తనపేరుపై రిజిస్టర్‌ చేయించాలని గొడవ పడడంతో సొంత అన్న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    anathapuram crime news
    anathapuram crime news

     



  • Jun 14, 2025 15:26 IST

    Turmeric Water: పసుపు నీళ్లు తాగితే ఏం అవుతుంది? ఈ మ్యాటర్‌ తెలుసుకుంటే..

    ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ. పసుపు నీరు తాగితే గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును తగ్గించడానికి, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.

    Turmeric Water
    Turmeric Water

     



  • Jun 14, 2025 15:25 IST

    Squid Game 3: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!

    'స్క్విడ్ గేమ్ సీజన్ 3' నుంచి ఫైనల్ గేమ్ కొత్త ట్రైలర్ విడుదలైంది. ఇందులో సియోంగ్ గి-హున్ భయాలతో పోరాడుతూ, అత్యంత ప్రమాదకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కనిపించింది. ఫైనల్ గేమ్ ఎపిసోడ్ జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

    Netflix Season 3 Final Game Trailer
    Netflix Season 3 Final Game Trailer

     



  • Jun 14, 2025 15:25 IST

    Danam Nagender VS Vijaya Reddy : దానం వర్సెస్‌ విజయారెడ్డి..కాంగ్రెస్‌లో రచ్చరచ్చ

    ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమావేశం బంజారా హిల్స్‌ లేక్‌ వ్యూలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మోల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

    Danam vs Vijaya Reddy



  • Jun 14, 2025 15:03 IST

    Flash: ఇచ్చిన అప్పు అడిగితే జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమాన

    తమిళనాడులో కీలక బిల్లులకు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆమోదం ఆమోదం తెలిపారు. రుణసంస్థలు బెదిరించి బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష విధించే బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. అలాగే, బయో వ్యర్థాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు.

    New law in Tamil Nadu



  • Jun 14, 2025 15:00 IST

    Crime: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య

    కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు.

    Crime
    Crime

     



  • Jun 14, 2025 14:19 IST

    Now or Nothing Sale: అరాచకమైన ‘నథింగ్’ సేల్.. ఫోన్లు, ఇయర్ బడ్స్, వాచ్‌లపై ఆఫర్లే ఆపర్లు!

    నథింగ్ రీసెంట్‌గా ‘నౌ ఆర్ నథింగ్’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో నథింగ్, CMF బ్రాండ్‌ల ప్రొడెక్టులపై ఆఫర్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ 3a సిరీస్, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ a, CMF బడ్స్ ప్రో, CMF బడ్స్ ప్రో 2 లను చౌకగా కొనుక్కోవచ్చు. 

    Nothing Announces Now or Nothing Sale in India
    Nothing Announces Now or Nothing Sale in India

     



  • Jun 14, 2025 13:55 IST

    11A సీటు మిస్టరీ.. విమాన ప్రమాదంలో ఒకడు కాదు ఇద్దరు బతికారు

    అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేశ్ సీటు నెంబర్ 11A చర్చనీయాంశమైంది. 27ఏళ్ల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన విమాన ప్రమాదంలోనూ అదే నంబర్ సీట్లో కూర్చున్న నటుడు రువాంగ్‌సాక్ బతికిపోయారు. ఇదే విషయాన్ని అతడు ఫేస్‌బుక్ ద్వారా తెలిపాడు.

    Seat 11A Mystery
    Seat 11A Mystery

     



  • Jun 14, 2025 12:57 IST

    ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!

    ఇరాన్ దగ్గరున్న ఈ 5 ఆయుధాలతో ఇజ్రాయిల్ భయపడుతుంది. రక్షణ వ్యవస్థలో బలమైన ఇజ్రాయిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఫతా క్షిపణి, అబూ మహదీ క్షిపణి, షాహెద్ 136, మొహజీర్-10 డ్రోన్, ఫతే-110 క్షిపణి ఆయుధాలు ఇవే.

    Iran weapons



  • Jun 14, 2025 12:56 IST

    విమాన ప్రమాదం.. తల్లి కళ్ల ముందే కాలిపోయిన కన్నకొడుకు

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో టీ స్టాల్ వద్ద నిద్రిస్తున్న 16 ఏళ్ల ఆకాష్ మంటల్లో చిక్కుకుని మరణించాడు. ప్రమాదం సమయంలో అతని తల్లి సీతాబెన్ టీ చేస్తోంది. తన కొడుకు మంటలతో కాలిపోతుండటంతో అతన్ని కాపాడటానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది.

    Ahmedabad Plane Accident 16 year old boy burnt death at tea stall mother in critical condition
    Ahmedabad Plane Accident 16 year old boy burnt death at tea stall mother in critical condition

     



  • Jun 14, 2025 12:14 IST

    ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో డెడ్‌బాడీ కలకలం

    ఆలేరు ఎమ్మెల్యే వ్యక్తి గత పనులు చేసే గంధమల్ల రవి (38) ఆత్మహత్య చేస్తున్నాడు. బీర్ల ఐలయ్య సొంత ఇంట్లోని మూడో అంతస్తు టెర్రస్ పైన ఉరేసుకొని చనిపోయాడు. అతని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

     Beerla Ilaiah house



  • Jun 14, 2025 12:14 IST

    రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!

    HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.

    today gold rates
    today gold rates Photograph: (today gold rates)

     



  • Jun 14, 2025 11:14 IST

    వైసీపీకి బిగ్ షాక్.. MLAకు నోటీసులు

    పొదిలి ఘర్షణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్‌ రైతు పోరుబాటలో చెలరేగిన అల్లర్లపై పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి నోటీసులు పంపారు.

    ycp mla MLA Buchepalli Sivaprasad Reddy



  • Jun 14, 2025 11:14 IST

    ఇరాన్ ప్రతీకార దాడులు.. ఇరు దేశాల్లో శవాల గుట్టలు

    ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం ఉదయం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అణుస్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌‌తో దాడి చేసింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి చేసినట్లు ఇరాన్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

     Iran launches attacks



  • Jun 14, 2025 09:50 IST

    ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి..

    ఎయిరిండియా విమానంలో తానూ ప్రయాణించానని మంచు లక్ష్మి తాజాగా పోస్టు చేసింది. అయితే అహ్మదాబాద్‌ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్‌‌కు వెళ్లానని తెలిపింది. ఈ విషాదకరమైన విమాన ప్రమాదంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంది.

    air india flight manchu lakshmi travel mumbai to london
    air india flight manchu lakshmi travel mumbai to london Photograph: (air india flight manchu lakshmi travel mumbai to london)

     



  • Jun 14, 2025 09:27 IST

    విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య

    అహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కి చేరింది. మొదట 265 మంది చనిపోయినట్లు నిర్ధారించగా తాజాగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది చనిపోయారు. ప్రమాదం జరగగానే 24మంది.. చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు.

    Ahmedabad plane crash death toll rises to 274 Air India Plane Crash
    Ahmedabad plane crash death toll rises to 274 Air India Plane Crash

     



  • Jun 14, 2025 08:11 IST

    6.5 తీవ్రతతో భారీ భూకంపం.. ప్రాణాలు గుప్పెట్లో పరుగో పరుగు

    రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 12 కి.మీ (7.46 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది.

    Earthquake
    Earthquake

     



  • Jun 14, 2025 08:10 IST

    కేటీఆర్‌‌కు బిగ్ షాక్.. కేసు నమోదు

    BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTRపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు FIR నమోదు చేశారు. CM రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని వెంకట్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Case registered against BRS working president KTR
    Case registered against BRS working president KTR

     



  • Jun 14, 2025 07:43 IST

    తెలంగాణలో గుండెపగిలే విషాదం.. అల్లుడి మరణ వార్త విని అత్త మృతి

    అల్లుడు గుండెపోటుతో మృతి చెందిన సమాచారం విని అత్త షాక్‌కు గురై మృతి చెందిన డబుల్ విషాద ఘటన మెదక్‌లో జరిగింది. మెదక్ డిగ్రీ కాలేజీలో రికార్డు అసిస్టెంట్ పనిచేస్తున్న వెంకటరమణ(40) గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త విని అత్త ఇందిరా(48) షాక్‌తో కుప్పకూలిపోయింది.

    mother in law died after hearing news of son in laws death in telangana
    mother in law died after hearing news of son in laws death in telangana

     



  • Jun 14, 2025 07:32 IST

    విమాన ప్రమాదం.. డాక్టర్ కావాలనే 20 ఏళ్ల యువకుడి కన్నీటి కథ..!

    అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బార్మర్‌కు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థి జైప్రకాష్ మరణించాడు. అతడు హాస్టల్‌లో భోజనం చేస్తుండగా విమానం పడి మృతి చెందాడు. అతడి మృతదేహం గ్రామానికి చేరుకోగానే అక్కడ శోకసంద్రం అలుముకుంది.

    Air India Plane accident rajasthan barmer medical student jaiprakash death
    Air India Plane accident rajasthan barmer medical student jaiprakash death

     



  • Jun 14, 2025 07:31 IST

    పెద్దవుతున్న యుద్ధం..ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్

    పశ్చిమాసియా మండుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. రెండుసార్లు ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇప్పుడు ఇరాన్ కూడా దాడులు ప్రారంభించింది. వందల కొద్దీ క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. 

    israel
    Iran strikes on Israel

     



  • Jun 14, 2025 07:31 IST

    అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్ - 4నెలల చిన్నారి సహా!

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ ట్రాక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4నెలల చిన్నారి కూడా ఉంది.

    karnataka road accident ap residents died
    karnataka road accident ap residents died

     



  • Jun 14, 2025 07:30 IST

    ముగిసిన మూడో రోజు ఆట..విజయం దిశగా సౌత్ ఆఫ్రికా

    సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 213/2 స్కోరుతో ఉంది. మరో 69 పరుగులు చేస్తే ట్రోఫీని సొంతం చేసుకుంటుంది.

    WTC
    Mrkaram Century, WTC Final

     



Advertisment
Advertisment
తాజా కథనాలు