/rtv/media/media_files/2025/06/14/WEg450iUsUHM8YWy2Z3T.jpg)
Iran strikes on Israel
ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్యలో తీవ్రస్థాయిలో యుద్ధం మొదలైంది. మొదట ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. టెహ్రాన్ దాని చుట్టుపక్కల అణుస్థావరాలు, వైమానిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. గురువారం, శుక్రవారం వరుసగా రెండు, మూడు సార్లు దాడులకు పాల్పడింది. ఇందులో ఇరాన్ కీలకమైన మిలటరీ అధికారులు, అణు శాస్త్ర వేత్తలను కోల్పోయింది. దాంతో పాటూ అక్కడి అణుకేంద్రాల్లో మౌలిక వసతులు కూడా బాగా దెబ్బ తిన్నాయి. అలాగే 78 మంది సాధారణ పౌరులు కూడా మృతి చెందారు. మరో 329 మంది గాయపడ్డారు. రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, దీనిని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి.
Also Read : ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!
ప్రతీకార దాడులు..
ఇజ్రాయెల్ దాడులకు ఇప్పుడు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆ దేశం మీదకు నిన్న రాత్రి వందల క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలెం ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయెలీలు గాయపడ్డారు. పలు భవంతులు దెబ్బతిన్నాయి. రాత్రి రెండు వందలకు పైగా మిస్సైల్స్ టెహ్రాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా రాసింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ మిస్సైల్స్ ను ఇజ్రాయెల్ సమర్థవంతంగా అడ్డుకుంటోందని చెబుతోంది. ఆ దేశానికి అగ్రరాజ్యం అమెరికా కూడా సహకారాన్ని అందిస్తోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ ను దెబ్బ కొట్టడానికి భారీగా ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు రాత్రి ఆ దేశం అణ్వాయుధాలను పరీక్షించనుందని చెబుతున్నారు.
Also Read : అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్ - 4నెలల చిన్నారి సహా!
🇮🇷| پیام مهم رئیس جمهور #پزشکیان
— Government of the Islamic Republic of Iran (@Iran_GOV) June 13, 2025
Important Message from President Masoud Pezeshkian
رسالة هامة من مسعود بزشکیان، رئيس الجمهورية الاسلامیة الایرانیة@drpezeshkian @PadDolat @IranGov_ar pic.twitter.com/oaBew4hdxP
ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని మండిపడ్డారు. ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. మరోవైపు తమతో ఇప్పటికైనా అణు ఒప్పంద కుదుర్చుకోవాలని ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్ ప్రతిదాడికి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకలను, సైనిక వ్యవస్థలను అమెరికా తరలిస్తోంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ ధరలు 12 శాతానికి పైగా పెరిగాయి.
Also Read : పెద్దవుతున్న యుద్ధం..ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్
Also Read: ముగిసిన మూడో రోజు ఆట.. విజయం దిశగా సౌత్ ఆఫ్రికా
today-latest-news-in-telugu | iran israel war | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu