/rtv/media/media_files/2025/06/14/7k09wdOEyMLIvwtCeUXO.jpg)
Death
హైదరాబాద్లో సనత్నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్మెట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా తిమ్మాపురానికి చెందిన కొక్కినీ శ్రావణి (30).. కొన్ని నెలల క్రితం హైదరాబాద్కు వలస వచ్చింది.
Also Read: మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి
ఎర్రగడ్డలోని జనప్రియ అపార్ట్మెంట్లో ఆమె హౌస్ కీపింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శ్రావణికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే శనివారం ఉదయం 8.30 గంటలకు ఆమె అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కుటుంబ కలహాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Also read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
Also Read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా400 ఆయుధాలు స్వాధీనం