/rtv/media/media_files/2025/06/14/i3pLb6CXKNhg1XanEYfP.jpg)
కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులు చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతిలోకి ఆహ్వానించింది. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని కవిత అన్నారు. అదే స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని కోరారు.
బీసీ బిల్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి - ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/PEzNTLtfZZ
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) June 14, 2025
సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలని సూచించారు. బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. దర్శనాల సంగతి పక్కనబెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలని ఆమె సూచించారు. RSS స్కూల్, టీడీపీ కాలేజీలో చదువుకొని.. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి జాబ్ చేస్తున్నారని సెటర్ వేశారు కవిత. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేస్తు్న్న జాబ్లో పాస్ మార్కులు రావడం లేదని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారని కవిత అన్నారు. కనీసం మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోలేని సీఎం రేవంత్ రెడ్డి.. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని కవిత చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత బలహీనంగా లేరని ఆమె అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని కవిత ఆరోపించారు.