/rtv/media/media_files/2025/06/14/nsbFEpFYFNyoSlSBqR6k.jpg)
DSC Exam dates changed in Andhra Pradesh
ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలు మార్చిన హాల్ టెకెట్లను జూన్ 25 నుంతి అధికారిక వెబ్సైట్లో https://apdsc.apcfss.in/ అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అయితే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి.అభ్యర్థులు ఈ మార్పును గమనించి మార్చిన హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీవర్ చెప్పారు. వాటి ప్రకారం పరీక్షలకు హాజరుకావాలని సూచనలు చేశారు.