/rtv/media/media_files/2025/06/14/rYNDJ2HsqbzQckHzFp0n.jpg)
Gaddar Film Awards : తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని హైటెక్స్లో ఇవాళ (శనివారం) సాయంత్రం ఈ వేడుక ఘనంగా మెుదలైంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిరథ మహారథుల ఆధ్వర్యంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కన్నులపండువగా సాగుతోంది. టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, పలువురు సినీ, సాహిత్య, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. విజేతలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా భారీ మొత్తంలో నగదు బహుమతులు అందజేస్తున్నారు.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా 2014--2023 జ్యూరీ కమిటీ చైర్మన్ మురళీ మోహన్ డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా చిరు సత్కారం చేశారు.అలాగే జ్యూరీ కమిటీ మెంబర్ దశరధ్, డీవీకే రాజులకు చిరు సత్కారం, గోల్డెన్ మొమెంటో ప్రదానం చేశారు. జ్యూరీ కమిటీ మెంబర్లు ఊహ, డైరెక్టర్ ఉమా మహేశ్వర్ రావు , వనజా ఉదయ్, కూచిపూడి వెంకట్, మధుర శ్రీధర్, జయసుధ, సహా మిగతా వారికి గోల్డ్ మొమెంటో అందచేశారు.ఈ సందర్బంగా గద్దర్ ఫౌండేషన్ కు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేశారు.
Also read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం
ఈ కార్యక్రమంలో జయజయహే గీతాన్ని కీరవాణి లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా దేవర సినిమాకు గాను ఆయుధ పూజ కొరియోగ్రఫీ చేసినందుకు గణేష్ ఆచార్యకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. గాంగ్స్టార్ సినిమాకు గాను యాక్షన్ కొరియోగ్రఫీ చేసినందుకు కె. చంద్రశేఖర్ రాధోడ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. మత్తు వదలరా 2 సినిమాకు గాను సత్య, వెన్నెల కిషోర్ ఇద్దరూ బెస్ట్ కమెడియన్స్ అవార్డు అందుకున్నారు. చెరో రెండున్నర లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటోలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాకు గాను శరణ్య ప్రదీప్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్నారు. 3 లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం అందుకున్నారు. కమిటీ కుర్రాళ్లు, ఆయ్,35 చిన్న కధ కాదుచ,, సరిపోదా శనివారం తదితర సినిమాలకు అవార్డులు అందజేశారు.
ఇది కూడా చదవండి: అంజీర్తో పాలు తాగితే ఏమవుతుంది? మంచిదా? చెడ్డదా?
కాగా 2024లో కల్కి 2989 ఏడీ ప్రథమ ఉత్తమ చిత్రంగా,పోట్టెల్ ద్వితీయ ఉత్తమ చిత్రం,లక్కీ భాస్కర్ తృతీయ ఉత్తమ చిత్రాలుగా అవార్డులు అందుకున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాకి గాను దర్శకుడు నాగ్ అశ్విన్ బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు.2024లో పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ బెస్ట్ హీరోగా,35 చిన్న కథ కాదు సినిమాకి గాను నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డును నందమూరి బాలకృష్ణకు అందజేశారు. కాగా ఈ సందర్భంగా పలువురు నటులు జై తెలంగాణ అంటూ నినదించడం అందరినీ ఆకట్టుకుంది.
Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!