/rtv/media/media_files/2025/06/14/bmB5eUIPjpSDHmnST8I8.jpg)
lady doctor digital arrested in srikakulam, lost 13.50 Lakhs
ఈమధ్యకాలంలో డిజిటల్ అరెస్టులు బాగా పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సైబర్ కేటుగాళ్లకు బలై ఓ లేడి డాక్టర్ రూ.13.50 లక్షలు పోగొట్టుకుంది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివేకానంద కేసు వివరాలు చెప్పారు.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
''ఓ లేడి డాక్టర్ సైబర్ మోసగాళ్ల వలలో పడి డిజిటల్ అరెస్టుకు గురైంది. ఆమె నుంచి నిందితులు రూ.13.50 లక్షలు దోచుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులందరూ కూడా కేరళకు చెందినట్లు గుర్తించాంమని'' డీఎస్పీ తెలిపారు. అలాగే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు పోలీసు శాఖ ప్రక్రియలోనే ఉండదని పేర్కొన్నారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం