Four Maoists killed : మధ్యప్రదేశ్‌ బాలాఘాట్ లో ఎన్‌కౌంటర్‌ నలుగురు మావోయిస్టులు మృతి

దేశవ్యాప్తంగా వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

New Update
Maoist

Four Maoists killed : దేశవ్యాప్తంగా వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. బాలాఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘావర్గాల నుంచి పోలీసులు, భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ సమచారంతో పోలీసులు,భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి కాల్పులు ఆగిపోగానే ఆ ప్రాంతంలో గాలించిన పోలీసులకు నాలుగు మృతదేహాలు లభించాయి. వాటిలో మూడు మహిళలవి కాగా, ఒకటి పురుషుడు ఉన్నారు. కాగా వారి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

మార్చి, 2026 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత నిరంతరాయంగా కొనసాగుతోంది. అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ఎదురు కాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు హతమవుతున్నారు. ఈ క్రమంలో పలువురు అగ్రనాయకులు కూడా మృత్యువాత పడ్డారు.

Also read: మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం

అయితే కర్రెగుట్ట పై భద్రతాదళాల దాడితో నక్సల్స్‌ ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయారు. భద్రతాదళాలు అక్కడ దాడి చేసి పలువురిని కాల్చి చంపాయి. అందులో మావోయిస్టు అధినేత నంబాల కూడా ఉన్నారు.  అక్కడి నుంచి జాతీయ పార్కులోకి మావోయిస్టులు పారిపోయారని తెలియడంతో భద్రతా దళాలు అక్కడ సైతం దాడులు చేసి పలువురు అగ్రనాయకులను హతమార్చాయి.  అయితే ఈ కూబింగ్‌ను తట్టుకోలేక కొందరు మావోయిస్టులు సరిహద్దు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాలోకి ప్రవేశించారంటూ నిఘావర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు ఎన్‌ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు