/rtv/media/media_files/2025/06/14/VUR6A90GSLiKVQAe2bpF.jpg)
Iran confirms two more senior generals killed in Israeli strikes
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయినట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక మీడియాలో ఈ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లోనే ఇరాన్కు చెందిన సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరలర్ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: విమాన ప్రమాదం.. తల్లి కళ్ల ముందే కాలిపోయిన కన్నకొడుకు
వాళ్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ నిర్ధరించినప్పటికీ.. ఇరాన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్పై గురువారం అర్ధరాత్రి దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడుల్లో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహ్మద్ భాఘేరి అలాగే దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్అలీ మృతి చెందాడు.
Also read: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
అంతేకాదు ఈ దాడుల్లో పలువురు అణు శాస్త్రవేత్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. శనివారం కూడా టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా.. టెల్అవీవ్ టార్గెట్గా మిసైళ్లను ప్రయోగించింది.
Also Read: విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య
Also read: 6.5 తీవ్రతతో భారీ భూకంపం.. ప్రాణాలు గుప్పెట్లో పరుగో పరుగు