/rtv/media/media_files/2025/06/12/iIEofRFqu8SrvWvBJFeR.jpg)
Former Gujarat CM Vijay Rupani On Board Flight To London
Vijay Rupani:
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ కూడా మరణించిన విషయం తెలిసిందే. లండన్ లో ఉన్న ఆయన భార్య, బిడ్డలను చూడడానికి వెళ్తున్న ఆయన ప్రమాదంలో మరణించారు. అయితే ఆయన ప్రయాణానికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూశాయి.
నిజానికి విజయ్ రూపాణీ లండన్ వెళ్లేందుకు రెండుసార్లు టికెట్బుక్ చేసుకుని, వీలుకాక రెండుసార్లు రద్దు చేసుకున్నారు. కానీ, మూడోసారి కూడా ఆయన గమ్యాన్ని చేరుకోకుండానే మృత్యు ఒడిలోకి చేరుకోవడం గమనార్హం. ఆయన లక్కీ నంబర్ "1206". ఆయన వ్యక్తిగత వాహనాలన్నీ దాదాపు అదే నంబరుతో ఉంటాయని సన్నిహితులు చెబుతున్నారు. విషాదం ఏంటంటే 1206 సంఖ్య కలిగిన తేదినే ఆయన మరణించారు. అంటే 12వ తేది 6వ నెల.
ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!
విజయ్ రూపాణీ ఆయన భార్య ఇద్దరూ వారి కుమార్తెను చూసేందుకు మేనెలలోనే లండన్ వెళ్లా్ల్సి ఉంది. దానికోసం ఆయన ఎయిర్ ఇండియా 171 విమానంలో టికెట్ సైతం బుక్ చేసుకున్నారు. అయితే తర్వాత కొన్ని కారణాలతో ఆ పర్యటన రద్దయింది. కాకపోతే ఆయన భార్య మాత్రం లండన్ వెళ్లారు. జూన్ 5న మరోసారి వెళ్లేందుకు మళ్లీ బుక్ చేసుకున్నారు. అయితే రూపాణీ బీజేపీ పంజాబ్ ఇన్ఛార్జీగా ఉన్నారు. అదే సమయంలో లుధియానా ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో ఆయన తన ప్రయాణాన్ని రెండుసార్లు రద్దు చేసుఏకున్నారు. కానీ ఆయనకు ఇష్టమైన తేదిన లండన్ ప్రయాణమై వెళ్తూ విమాన ప్రమాదంలో మృతి చెందటం గుజరాత్ బీజేపీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Also Read : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి
Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!