Local elections : స్థానిక ఎన్నికల ఎఫెక్ట్‌...ఆ మూడు పథకాల అమల్లో జోరు

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రభుత్వం రైతుభరోసాను అమలు చేయనుంది. దీనితో పాటు రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో కూడా వేగం పెంచాలని అధికారులను ఆదేశించింది.

New Update
rythu Bharosa revanth reddy

rythu Bharosa revanth reddy

Local Elections:  

అన్నదాతలకు రేవంత్‌ సర్కార్ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైంది. రైతులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రైతుభరోసా పెట్టుబడి సాయం మరో పదిహేను రోజుల్లో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ లోపే అన్ని రకాల నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తున్న ప్రభుత్వం ఎన్నికలకు ముందే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఈ నెలలో వానాకాలం రైతు భరోసా నిధులు జమచేసేందుకు కసరత్తు  చేస్తోంది. ఈ క్రమంలోనే నిధుల సమీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నుంచి రూ. 3 వేల కోట్ల అప్పు తీసుకుంది. ఈ మొత్తంతో పాటు మరో రూ.4వేల కోట్లకు కూడా ఇండెంటు పెట్టినట్లు తెలిసింది. ప్రభుత్వం చేతికి డబ్బులు రాగానే పెట్టుబడి సాయం వేయనుంది.

Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!

గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేసింది. దానికోసం సీజన్‌కు రూ.7,500 కోట్లు ఖర్చు చేసింది.  కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 2023- 24 యాసంగి సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు పంపిణీ చేసింది. అయితే వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా నిధులు పడుతున్నాయన్న కాంగ్రెస్‌ ప్రక్షాళన మొదలు పెట్టింది. దీనికోసం వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. ఇక మొన్నటి యాసంగి సీజన్‌లో 4 ఎకరాల లోపు ఉన్న 57లక్షల మంది రైతులకు మాత్రమే రైతుభరోసా అమలు చేసింది ఆ లెక్కన 84 లక్షల ఎకరాలకు రూ. 5,058 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. ఈ వానాకాలం రైతుభరోసా ఎన్ని లక్షల ఎకరాలకు ఎంతమంది రైతులకు ఇస్తారు అనే క్లారిటీ లేదు. కానీ మొత్తం మీదా స్థానిక సంస్థల ఎన్నికల ముందే రైతు భరోసా ఇవ్వాలని భావిస్తోంది.

Also Read: ఇచ్చిన అప్పు అడిగితే జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమాన

 ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వం ఇటీవలె ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచింది. రైతు భరోసాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆరు గ్యారంటీల పేరుతో మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత వంటి పథకాలను ప్రకటించింది. వీటిలో కొన్నింటిని అమలు చేస్తోంది. అయితే రేషన్‌ కార్డుల పంపిణీ పూర్తి కాలేదు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈ మధ్యే ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రేషన్‌ కార్డుల పంపిణీ త్వరిత గతిన అమలు చేయాలని నిర్ణయించింది.

Also Read: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య

ఇదిలా ఉండగా ఈ నెల నాలుగో వారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులపై చర్చించనున్నారు.  ఆ తర్వాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో స్తబ్ధత నెలకొన్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికోసం ఈ నెల ఆఖరుకు నోటీఫికేషన్‌ ఇచ్చి జూలైలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం అన్ని రకాలుగా తమకు మేలు జరుగుతుంది భావిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమైతేనే పథకాల అమలును వేగవంతం చేసేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు