🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

Also Read: భారతీయ విద్యార్థిపై అమెరికా అధికారుల కర్కశం.. వీడియో వైరల్

RTV LIVE Telugu News App

Also Read :  జూన్ 14 వరకు భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం

RTV న్యూస్ యాప్(RTV NEWS APP) ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు. 

Also Read: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

RTV News App Download Links:

ఆండ్రాయిడ్ వినియోగదారులు(Android) - https://t.co/B1FaPB6Zsr
IOS వినియోగదారులు - https://t.co/4nRQaLbtfv

RTV NEWS APP

  • Jun 12, 2025 14:09 IST

    ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం

    గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 



  • Jun 12, 2025 13:49 IST

    సిరిసిల్లలో భారీగా మరణాలు.. 5,130 చావులతో UNO ఆందోళన

    ఇండియాలోని 49 జిల్లాల్లో 2021 జననాల రేటు కంటే మరణాలు రేటు అధికంగా నమోదైంది. CRS 2021 డేటా ప్రకారం.. సిరిసిల్లాలో జిల్లాలో 5,028 జననాలు నమోదవ్వగా.. 5,130 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం 2,34,425 మరణాలు నమోదయ్యాయని UNO ఆదోళన వ్యక్తం చేసింది.

    Deaths in Sircilla



  • Jun 12, 2025 13:19 IST

    ‘తల్లికి వందనం’ రూ.13వేలే.. రూ.2వేలు కట్ - ఎందుకంటే?

    ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల్ని రిలీజ్ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనుంది. మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు. పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో ఈ విషయం తెలిపింది.

    Talliki Vandanam 2000 deducted
    Talliki Vandanam 2000 deducted

     



  • Jun 12, 2025 13:03 IST

    కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి తుమ్మల.. రేవంత్ బిగ్ స్కెచ్ ఇదేనా?

    కాళేశ్వరం కమిషన్ విచారణకు త్వరలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరు కానున్నారు. BRS హయాంలో కేబినేట్ సభ్యుడిగా పలు సబ్ కమిటీల్లో తుమ్మల సభ్యుడిగా పనిచేశారు. దీంతో ఆయన వాగ్మూలం కీలకంగా మారునుంది. మొదటి నుంచి ఆయన హరీశ్, ఈటల, KCR సమాధానాలను తప్పుబడుతున్నారు.

    BRS MLA: సీనియర్లకు హ్యాండిచ్చిన కేసీఆర్ :  తాండూర్, పాలేరు, మహేశ్వరం, కొత్తగూడెంలో ఇదే సీన్



  • Jun 12, 2025 12:47 IST

    రేషన్ కార్డు మస్ట్.. కారు ఉంటే రాదు - తల్లికి వందనం గైడ్‌లైన్స్

    ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దాని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. రైస్ కార్డు తప్పనిసరి. ఫోర్ వీలర్ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రాదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 75శాతం హాజరు ఉండాలి.

    Talliki Vandanam Guidelines
    Talliki Vandanam Guidelines

     



  • Jun 12, 2025 11:32 IST

    YCPకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్..?

    మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అక్రమాల్లో నాని, ఆయన కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని సమాచారం.

    former minister Perni Nani arrest



  • Jun 12, 2025 10:51 IST

    రెడ్ జోన్ లో స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్ గా ట్రేడింగ్

     దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.

    Stock Market Today: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్..



  • Jun 12, 2025 10:18 IST

    టెన్త్‌లో టాప్ మార్కులు.. ప్రేమోన్మాది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య!

    అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులు తట్టుకోలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 10వ తరగతిలో 554 టాప్ మార్కులు సాధించిన తమ కూతురికి ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమునీరుగా విలపిస్తున్నారు. 

    Annamayya district 10th student suicide
    Annamayya district 10th student suicide

     



  • Jun 12, 2025 10:06 IST

    ఈ నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.7వేలు.. మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

    ఏపీ ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు మొత్తం 7 వేల రూపాయలను ఈ నెల 21న తొలివిడతలో జమ చేస్తామన్నారు. 

    annadata sukhibhava



  • Jun 12, 2025 09:57 IST

    సినీ నటి కల్పిక పై కేసు నమోదు

    సినీ నటి కల్పిక పై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్‌లో సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిన నేపథ్యంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రిజం పబ్ యజమాన్యం గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కోర్టు అనుమతితో కల్పికపై కేసు నమోదు చేశారు.

    annadata sukhibhava.
    annadata sukhibhava

     



  • Jun 12, 2025 09:57 IST

    చెంచల్‌గూడ జైలుకు కాళేశ్వరం ఇంజినీర్

    కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్‌ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ ఇంట్లో ACB రైడ్స్ నిర్వహించింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

     



  • Jun 12, 2025 09:56 IST

    టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

    టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.సీనియర్ నిర్మాత కె.మహేంద్ర 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

    producer k mahendra passed away
    producer k mahendra passed away

     



  • Jun 12, 2025 09:07 IST

    ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..మిడిల్ ఈస్ట్ నుంచి తమ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్న అమెరికా..

    ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధ్రువీకరించారు. ఈ కారణంగానే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న తమ సిబ్బంది వెనక్కు రప్పిస్తోంది అమెరికా.



  • Jun 12, 2025 09:07 IST

    ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!

    ఇటీవల యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. UPI లావాదేవీలపై ట్యాక్స్ లేదా ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. 

    GST on UPI payments



  • Jun 12, 2025 09:06 IST

    తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు

    రాష్ట్రంలో నేటి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.



  • Jun 12, 2025 08:13 IST

    ఈదురుగాలులకు గోడ కూలి ముగ్గురు స్పాట్ డెడ్..

    మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా సిద్ధార్థ్ గార్డెన్ సమీపంలోని ప్రవేశ ద్వారం నిర్మాణంలో ఒక భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

    Chhatrapati Sambhajinagar's Siddharth Garden
    Chhatrapati Sambhajinagar's Siddharth Garden

     



  • Jun 12, 2025 07:54 IST

    BSF జవాన్లకు అవమానం.. అధికారులను సస్పెండ్ చేసిన రైల్వే మంత్రి

    BSF జవాన్లకు శిథిలావస్థలో మురికిగా ఉన్న రైల్వే కోచ్‌ని కేటాయించిన ఘటనపై నలుగురు రైల్వే అధికారులపై వేటు పడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వారిపై యాక్షన్ తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

    Ashwini Vaishnaw



  • Jun 12, 2025 07:47 IST

    మంగళసూత్రమే పట్టించింది..హనీమూన్ మర్డర్ కేసు వెలుగులోకి మరో విషయం

    మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనమ్ మంగళసూత్రమే ఆమెను పట్టిచ్చిందని పోలీసులు చెబుతున్నారు. సోనమ్ మంగళసూత్రాలు, వెడ్డింగ్ రింగ్ హోటల్ రూమ్ లోనే వదిలేసినట్లు గుర్తించారు.

    murder
    Honeymoon Murder Case

     



  • Jun 12, 2025 07:47 IST

    ఏపీలో తీవ్ర విషాదం.. విషవాయువు లీకై ఇద్దరు మృతి

    అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని బుధవారం అర్ధరాత్రి SS ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. రసాయన వ్యర్థాల నిర్వాహణ కోసం ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.



  • Jun 12, 2025 07:46 IST

    తెలంగాణలో గుండె పగిలే ఘోరం.. ముగ్గురు అన్నదమ్ముల మృతి - కన్నీళ్లు మిగిల్చిన బర్త్ డే వేడుక

    తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాయితేజ, వాసా పవన్‌కుమార్‌, వాసా రాఘవేందర్‌ మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు.

    Read More



  • Jun 12, 2025 07:46 IST

    ఆరోరోజూ చల్లారని మంటలు..లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ, 200మంది అరెస్ట్

    లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరాన్ని విముక్తి చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. కానీ నిరసనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు.

    la
    Curfew Imposed In Los Angeles

     



  • Jun 12, 2025 07:45 IST

    నేడే అకౌంట్లోకి రూ.15వేలు.. డబ్బులు పడాలంటే ఇలా చేయాల్సిందే?

    ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందించనున్నారు. ఈ స్కీమ్ కింద ఇవాళ తల్లుల అకౌంట్లలో రూ.8745 కోట్లు జమ చేయనున్నారు.

    Talliki Vandanam
    Talliki Vandanam

     



  • Jun 12, 2025 07:44 IST

    అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌‌..

    అమెరికా ఏం చేస్తేందో అర్ధం కావడం లేదు.భారత్ కు సపోర్ట్ ఇస్తున్నట్టే ఇస్తూ పక్క నుంచీ పాకిస్తాన్ను నెత్తి మీద పెట్టుకుంటోంది. యూఎస్ తో జరగనున్న ఆర్మీ డే కు పాక్ ఆర్మీ ఛీఫ్ ను పిలిచింది.అయితే దీని వెనుక వేరే పెద్ద స్కేచ్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

     Pakistan army chief Asim Munir
    Pakistan army chief Asim Munir

     



Advertisment
Advertisment
తాజా కథనాలు