JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్‌ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ కాన్పుర్ ఈ ఫలితాలు వెల్లడించింది. ఫలితాలు తెలుసునేందుకు https://results25.jeeadv.ac.in/ పై క్లిక్ చేయండి. 

Weather: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అస్సాం మంత్రి జయంత మల్లాబరువా ప్రకటించారు.

B Tech: బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులపై AICTE కీలక ప్రకటన

కొత్త విద్యా సంవత్సరం 2025-26 లో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్ తరగతులు ఆగస్టు 14 నాటికి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తాజాగా అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Amit shah: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అన్నారు.

NIA: దేశంలో పాక్‌ గూఢచర్యం.. NIA తనిఖీలు

NIA ఆదివారం దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. పాక్‌ నిఘా సంస్థ ISIతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

Sukhoi fighter jet: జగన్నాథుడి రథచక్రాలుగా సుఖోయ్‌ ఫైటర్‌ జెట్‌ టైర్లు (VIDEO)

కోల్‌కతాలోని జగన్నాథ స్వామి ఊరేగింపు రథానికి సుఖోయ్ 30 ఫైటర్ జెట్ టైర్లు వాడుతున్నారు. నిర్వాహక సంస్థ ఇస్కాన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. సుఖోయ్ ఫైటర్ జెట్‌కు వాడే 4 టైర్లను తయారీ కంపెనీ డెలివరీ చేసింది.

Web Stories
web-story-logo Workout వెబ్ స్టోరీస్

పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

web-story-logo Bath and boredom వెబ్ స్టోరీస్

స్నానం చేసిన వెంటనే నీరసంగా ఉందా..?

web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

Advertisment

IDF: 30 సెకండ్లలో 50 బాంబులు.. మరో హమాస్ కీలక నేత మృతి

మే 13న గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో 30 సెకండ్లలోనే 50కి పైగా బాంబులు పడ్డాయి. అయితే ఈ ఆపరేషన్‌లో హమాస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు మహ్మద్‌ సిన్వర్, మహ్మద్‌ షబానా మరణించినట్లు తాజాగా ఐడీఎఫ్‌ వెల్లడించింది.

Nigeria Bus Crash: అయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 21 మంది అథ్లెట్స్ మృతి

నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్‌ మృతి చెందారు. నేషనల్‌‌స్పోర్ట్స్‌‌‌ టోర్నమెంట్‌‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగం వల్లే ఇది జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

USA: మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా..

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లాస్‌ ఏంజెల్స్‌తో పాటు నార్త్‌ కరోలినాలోని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Bangladesh: బంగ్లాదేశ్‌ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు

బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం.. మాజీ ప్రధానమంత్రి షేక్ ముజిబుర్‌ రెహమాన్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను మార్చింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలతో ఉన్న కొత్త నోట్లను విడుదల చేసింది.

Paris Riots: పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. 192మందికి పైగా

ఫ్రాన్స్‌లో ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు గెలచింది. దీంతో పారిస్‌ వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓడిపోయిన జట్టుతో అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందారు. 197 మంది గాయపడ్డారు.

BIG BREAKING: రష్యాకు బిగ్ షాక్.. 40 విమానాలను నాశనం చేసిన ఉక్రెయిన్

ఉక్రెయిన్ ఆదివారం రష్యాలోని పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని కీలక వైమానిక స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఒలెన్యా, బెలయా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైయ్యాయి.

Advertisment

MLC Kavitha: బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన కవిత.. రాష్ట్ర అవతరణ వేడుకల సాక్షిగా..

ఈ రోజు జాగృతి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MLC కవిత BRSకు బిగ్ షాక్ ఇచ్చారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన కవిత BRS పేరు మాత్రం ఎత్తలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

BIG BREAKING: తెలంగాణ ప్రజలకు షాక్.. ఆ స్కీమ్‌కు బ్రేక్?

రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2 నుంచి అమలకు బ్రేక్ పడింది. కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించి సమర్పించిన నివేదికల ఆధారంగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితా ఖరారు చేసి రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.

Telangana: నేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్‌.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

తెలంగాణలో నేటి (జూన్ 2) నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో అవినీతిని నివారించేందుకు దీన్ని తీసుకొచ్చారు.

Telangana Formation Day 2025: ఆ స్ఫూర్తితో ముందుకు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవిత ట్వీట్!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల KCR పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రం మరింత ముందుకు సాగాలని కోరుకుందామన్నారు.

Telangana Formation Day 2025: జీవితమంతా తెలంగాణ కోసమే.. స్వరాష్ట్రం చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన తన చివరి శ్వాస వరకు జై తెలంగాణ అనే నినాదాన్ని ఆపలేదు. కానీ తన చిరకాల స్వప్నం అయిన తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన కన్నుమూశారు.

ATM Robbery: ఇలా దోచేశారేంట్రా.. గ్యాస్ కట్టర్‌తో ATM బాక్సా‌ను కట్ చేసి - లక్షల్లో!

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌‌లో దొంగతనం జరిగింది. ఆదివారం లింగగిరి రోడ్డులో ఉన్న SBI ఏటీఎంలో రూ.19.66లక్షలు చోరీకి గురైంది. కొందరు దుండగులు గ్యాస్ కట్టర్‌తో ATM బాక్స్‌ను కట్‌ చేసి డబ్బులు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisment

AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు

చిత్తూరు జిల్లా గంటావూరు కాలనీ గంగమ్మ జాతర వేడుకల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. జాతర సందర్భంగా దర్శనానికి వచ్చిన ఓ యువతి మెడలో ఆ యువకుడు తాళి కట్టాడు. ఈ చిల్లర చేష్టల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AP Crime: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 కేజీలు ఉన్న 40 బస్తాలను అమలాపురం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

AP News: ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ముఖ్యం: విశాఖ కలెక్టర్

ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదపడుతోంది. విశాఖపట్నంలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలు, ఉద్యోగులు, ప్రతి వర్గానికీ యోగా దినోత్సవంలో పాల్గొనాలన్న బాధ్యత ఉందని కలెక్టర్ డా. హరేండ్రప్రసాద్ అన్నారు.

Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కావమ్మ తల్లి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. తిరునాళ్లు 2వరోజు శనివారం రాత్రి అమ్మవారిని పురవీధుల్లో ఉరేగిస్తున్నారు. ఉత్సవ నిర్వాహకుడు కావమ్మ తల్లికి దిష్టి తీస్తూ తాండవం చేశాడు. తర్వాత అక్కడికక్కడే మృతి చెందాడు.

AP Crime: ఏపీలో దారుణం.. పంపు బాయ్ ఫకృద్దీన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టిన మేనేజర్లు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఉన్న పెట్రోలు బంకులో పని చేస్తున్న పంపు బాయ్ బాబా ఫకృద్దీన్‌ రూ.23 వేలు తీసుకున్నాడని మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్‌ స్తంభానికి కట్టేసి శారీరకంగా దాడి చేశారు.

Covid Effect: కరోనా ఎఫెక్ట్.. చికెన్ కి భారీ డిమాండ్!

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ డిమాండ్ పెరిగింది. చికెన్ ధరలు ఒక్కసారిగా రూ. 30 వరకు పెరిగాయి. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రోటీన్ ఫుడ్‌ అయిన చికెన్, గుడ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

Advertisment

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment