Weather: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అస్సాం మంత్రి జయంత మల్లాబరువా ప్రకటించారు.

New Update
Sikkim floods

assam floods

Crime News: ఈశాన్య భారత్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  కొండచరియలు విరిగిపడడం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉత్తర సిక్కింలో 1200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. మే 29న మున్షితాంగ్ వద్ద తీస్తా నదిలో ఓ వాహనం జారిపోవడంతో ఎనిమిదిమంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తరలింపు కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా.. కొండచరియలు విరిగిపోవడం వల్ల రహదారులు మూసుకుపోయాయి. ఈ ఘటన సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగించింది.

Also Read :  ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి

భారీ వర్షాలకు జనం అతలాకుతలం..

ఇక మేఘాలయలో పది జిల్లాలు వరదలు, కొండచరియల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10 వేల మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదల వల్ల ఇళ్లు కోల్పోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో అస్సాంలో పరిస్థితి మరింత విషమంగా మారింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లోని 764 గ్రామాలు వరదలు కురవగా.. దాదాపు 3.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వరదల కారణంగా ఇప్పటికే పదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య పెరిగింది. అస్సాంలోని దిబ్రూగఢ్, నీమతిఘాట్ వంటి ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలోని మరో ఐదు ప్రధాన నదులు కూడా ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే 10 వేల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఈ 5 వస్తువులను మామిడి పండ్లతో తింటే ఆరోగ్యానికి హానికరమని తెలుసా..?

ఈ పకృతి విపత్తు సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ముఖ్యమంత్రులతోపాటు మణిపూర్ గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయాన్ని అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, మోడీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలతో కలిసి నిలుస్తుందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అస్సాం మంత్రి జయంత మల్లాబరువా ప్రకటించారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం సహాయ చర్యలను వేగవంతం చేస్తోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు

Also Read :  ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి



( sikkim-floods | sikkim-floods-today | rain | Latest News)

Advertisment
Advertisment
తాజా కథనాలు