/rtv/media/media_files/2025/06/02/UZ17JIO07tgBmDjICcb0.jpg)
Nigeria Bus Crash 21 Young Athletes Die
రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అతివేగం కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది అథ్లెట్లు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
21 మంది అథ్లెట్స్ మృతి
నైజీరియా హైవేపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో నేషనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ నుండి తిరిగి వస్తున్న 21 మంది అథ్లెట్లు మరణించారు. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని ఫెడరల్ రోడ్ సెఫ్టీ కార్ప్స్ వెల్లడించింది. కాగా డ్రైవర్ అలసిపోవడం, నిద్రమత్తు, అధిక వేగం వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
కాగా క్రీడాకారులు ప్రయాణిస్తున్న బస్సు.. ఇతర వాహనాలను ఢీకొనలేదని.. రాత్రిపూట సుదీర్ఘ ప్రయాణం తర్వాత డ్రైవర్ అలసిపోవడం, అధిక వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ (FRSC) తెలిపింది.
మృత్యువాత పడ్డ అథ్లెట్లు దాదాపు 1,000 కిలోమీటర్లు (620 మైళ్ళు) దూరంలో ఉన్న ఓగున్ రాష్ట్రంలో 22వ జాతీయ క్రీడా ఉత్సవం నుండి నైజీరియా ఉత్తరాన ఉన్న కానోకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా గత సంవత్సరం నైజీరియాలో 9,570 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. దీని ఫలితంగా 5,421 మంది మరణించారని FRSC డేటా తెలిపింది.
Also Read : దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
road-accident | latest-telugu-news | telugu-news | telugu crime news | today-news-in-telugu | international news in telugu