/rtv/media/media_files/2025/06/01/WGbzn4zgQ2DSgslpG9YC.jpg)
Hindu, Buddhist temples replace Mujib image on new Bangladesh currency notes
బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను మార్చింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలతో ఉన్న కొత్త నోట్లను విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఈ కొత్త కరెన్సీ నోట్ల జారీ మొదలైంది. బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కొత్త కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవని స్పష్టం చేశారు.
Also Read: పారిస్ వీధుల్లో ఘర్షణలు.. 192మందికి పైగా
వీటికి బదులు ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాలని పేర్కొన్నారు. కొత్త కరెన్సీ నోట్లలో చారిత్రక ప్రదేశాలతో సహా హిందూ, బౌద్ధ దేవాలయాల చిత్రాలు ఉంటాయని తెలిపారు. అలాగే దివంగత చిత్రకారుడు జైనుల్ అబెదిన్ గీసిన కళాఖండాలు కూడా కొత్త కరెన్సీ నోట్లలో ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 9 డిజైన్లను రూపొందించగా.. జూన్ 1న కొత్త కరెన్సీ నోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
ఇదిలాఉండగా.. తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ 1971లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్ను ముద్రించారు. మరికొన్నేళ్లకు షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రంతో కూడిన నోట్లు విడుదల చేశారు. గతేడాది రిజర్వేషన్ అంశంలో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికీ కూడా ఆమె తండ్రి ఫొటోలనే కరెన్సీ నోట్లగా కొనసాగించారు. కానీ తాజాగా ఆయన స్థానంలో కొత్త వాటిని విడుదల చేశారు.
Also Read: గర్ల్ఫ్రెండ్కు రూ.30 కోట్లు లాటరీ డబ్బు ఇస్తే.. మంచంలో మరో యువకుడితో..!
Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు
telugu-news | rtv-news | bangladesh | currency-notes