NIA: దేశంలో పాక్‌ గూఢచర్యం.. NIA తనిఖీలు

NIA ఆదివారం దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. పాక్‌ నిఘా సంస్థ ISIతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

New Update
NIA

NIA

ఇటీవల యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్ర పాక్‌ నిఘా సంస్థలకు భారత సున్నిత సమాచారాన్ని చేరవేసిందనే ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మరికొంతమందికి కూడా పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఆదివారం దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. పాక్‌ నిఘా సంస్థ ISIతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు

తనిఖీల సందర్భంగా NIA అధికారులు పలు ఎలక్ట్రానికిక్ పరికరాలను సీజ్‌ చేయగా.. పలు సున్నితమైన ఆర్థిక డాక్యుమెంట్స్‌ కూడా దొరికాయి. పాక్ నుంచి గూఢచర్యం చేస్తున్న ఆపరేటివ్‌ల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీటిని విశ్లేషిస్తామని అధికారులు తెలిపారు. గూఢచర్యానికి కావాల్సిన ఆర్థిక సహకారాలు కూడా వీళ్ల నుంచి అందినట్లు తమకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు.  

ఈ ఏడాది మే 20న NIA  ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. అతడు 2023 నుంచి పాకిస్థాన్‌కు భారత సున్నిత సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతడు పంపించిన సమాచారంలో జాతీయ భద్రతకు ముప్పుగా మారే అంశాలు కూడా ఉన్నాయి. భారత్‌లోని పలువురు వ్యక్తుల నుంచి అతడిని నిధులు అందేవి. ఇప్పటికే జ్యోతి మల్హోత్రాతో పాటు మరికొందరిని కూడా గూఢచర్యం కేసులో దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. 

Also Read: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!

మరోవైపు పాక్ నిఘా సంస్థ ఏజెంట్లకు భారతీయ మొబైల్‌ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలతో ఖాసిం అనే వ్యక్తి కూడా ఇటీవల అరెస్ట్ అయ్యాడు. పాక్‌లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన అతడి ఇంటర్వ్యూ వీడియో బయటపడింది. ఖాసిం కూడా పాకిస్థాన్‌లో పర్యటించినట్లు అధికారులు తెలిపారు.  

telugu-news | rtv-news | JYOTHI MALHOTRA | pakistan | national-investigation-agency 

Advertisment
Advertisment
తాజా కథనాలు