/rtv/media/media_files/2025/06/01/HpXLyFp1jL8eGiK1prgj.jpg)
Sri Sathya Sai crime news
AP Crime: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని పెట్రోలు బంకులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో ఉన్న పెట్రోలు బంకులో పనిచేస్తున్న పంపు బాయ్ బాబా ఫకృద్దీన్పై మేనేజర్లు పాశవికంగా ప్రవర్తించారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఫకృద్దీన్ను బంకు మేనేజర్లు సత్యనారాయణ, అమర్లు నిలిపి, డబ్బులు తక్కువగా జమ చేశారంటూ ప్రశ్నించారు. వారి మాటల ప్రకారం.. రూ.23 వేలు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు.
పెట్రోలు బంకులో అమానవీయ ఘటన..
దీనికి స్పందించిన ఫకృద్దీన్ తాను ఎలాంటి డబ్బులను వాడలేదని.. వచ్చిన మొత్తాన్ని వారికి అప్పగించానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే మేనేజర్లు ఆ వివరణను పట్టించుకోకుండా తక్కువగా ఉన్న డబ్బులు ఇచ్చే వరకు అక్కడి నుంచే కదలవద్దని హెచ్చరించారు. వెంటనే ఆగ్రహానికి లోనైన మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి స్థానిక టెలిఫోన్ స్తంభానికి కట్టేసి శారీరకంగా దాడికి దిగారు. ఈ దారుణ ఘటనతో ఫకృద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: ఈ 5 ఫుడ్ ఐటెమ్స్ తినే మహిళలు ఎక్కువ కాలం యవ్వనంగా ఎలా ఉంటారు?
మానవత్వం ఉంది అంటారా ఈ పేద ముస్లిం కుటుంబాన్ని అండగా నిలిచేది ఎవరు? కదిరి కుమ్మర వాండ్లపల్లి నయారా పెట్రోల్ బంకులు...
Posted by Jeelan Basha on Saturday, May 31, 2025
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. బాధితుడి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పెట్రోలు బంకు వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు బత్తల హరిప్రసాద్కు చెందినదిగా సమాచారం. ప్రస్తుతం హరిప్రసాద్ బదులు ఆయన తమ్ముడు తోట హరిప్రసాద్ ఈ బంకును నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: మహబూబ్నగర్లో క్షుద్ర పూజల కలకలం.. మూఢనమ్మకాల మాయలో మరుగున పడిన మానవత్వం
(ap crime updates | ap-crime-news | ap crime latest updates | Latest News | telugu-news)