/rtv/media/media_files/2025/06/01/CH5Ig4snEH57lz7ThtY7.jpg)
జగన్నాథుడిని ఊరేగింపు రథ చక్రాలుగా రక్షణ వ్యవస్థలోని ఫైటర్ జెట్ టైర్లు వినియోగిస్తున్నారు. అందుకోసం భారత ప్రధాన ఫైటర్ జెట్ సుఖోయ్-30 కోసం తయారు చేసిన టైర్లను వాడనున్నారు. కోల్కతాలోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ ఇస్కాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఈ ఆలయంలోని స్వామివారి రథానికి బోయింగ్ విమానం టైర్లు ఉపయోగించారు.
Lord Jagannath Chariots gets brand new Sukhoi 4th generations plane tyres.
— Abir Ghoshal (@abirghoshal) June 1, 2025
Yesterday @iskcon Kolkata unit
did 24th Kilometers dry run of the Chariots with Sukhoi tyres. pic.twitter.com/qR4KK8uqB1
గత 15 ఏళ్లుగా వాటిని కొనుగోలు చేయడం ఇస్కాన్కు సాధ్యం కాలేదు. గత ఏడాది ఈ రథం చక్రాల్లో సమస్యలు వచ్చాయి. దాంతో ఆలయ నిర్వాహకులు సుఖోయ్ 30 ఫైటర్ జెట్ టైర్లను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కోల్కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ దాస్ వెల్లడించారు. యుద్ధ విమానం టైర్లు ఇస్కాన్ సంస్థ ఆర్డర్ చేస్తే.. వాటి అవసరం ఏంటని సదరు కంపెనీ కూడా ఆశ్చర్యపోయిందని రాధారమన్ దాస్ తెలిపారు. దీంతో ఆయన వారికి రథ చక్రాల సమస్యని వివరించారు. స్వయంగా టైర్ల తయారీ కంపెనీ నుంచి కొందమంది వచ్చి పరిస్థితిని పరిశీలించారు. దాంతో వారు ఆలయం రథం కోసం 4 టైర్లు డెలివరీ చేశారు. ఇటీవల వాటిని రథానికి బిగించారు. త్వరలోనే ఊరేగింపు కార్యక్రమం ఉందని ఆలయ సిబ్బంది తెలిపారు.
Sukhoi fighter jet tires | wheels | rafale fighter jet | latest-telugu-news | kolkatha