Rajiv Yuva Vikasam: తెలంగాణ ప్రజలకు షాక్.. ఆ స్కీమ్‌కు బ్రేక్?

రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2 నుంచి అమలకు బ్రేక్ పడింది. కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించి సమర్పించిన నివేదికల ఆధారంగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితా ఖరారు చేసి రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.

New Update
Revanth Reddy

Revanth Reddy

Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2 నుంచి అమలకు  బ్రేక్ పడింది.దాని అమలులో కొంత ఆలస్యం జరగనున్నట్టు తెలుస్తోంది. నేడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం సాగు ఏర్పాట్లతోపాటు రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రాముఖ్యతతో చర్చ జరిగింది. పథకానికి అంచనాలను మించి దరఖాస్తులు రావడంతో.. అనర్హులచే ప్రయోజనాలు పొందే ప్రమాదాన్ని పలు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పథకం యొక్క నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క అనర్హుడికైనా లబ్ధి కలగకూడదన్నదే అధికారుల దృక్పథంగా ఉండటంతో.. దరఖాస్తులపై లోతైన పరిశీలన చేపట్టనున్నారు.

Also Read :  ముంబైని ఏడిపిస్తూ.. పంజాబ్‌ను నవ్విస్తున్న వీడియో..

కీలక అంశాలపై సమీక్షలు..

అర్హులైన యువతను మాత్రమే గుర్తించేందుకు సమగ్ర విధానం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై రాబోయే జూన్ 5న జరిగే కేబినెట్ సమావేశంలో మరింత స్పష్టత రానుంది. మంత్రులు తమ జిల్లాల్లో మే 29, 30 తేదీలలో కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించి సమర్పించిన నివేదికల ఆధారంగా ఈరోజు జరిగిన సమావేశంలో చర్చ జరిగింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితా ఖరారు చేసి జూన్ 9 వరకు రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. పథకంలో అర్హత పొందిన యువతకు జూన్ 10 నుంచి 15 వరకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ శిక్షణ ద్వారా వారు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. అనంతరం జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతాయి.

ఇది కూడా చదవండి: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి

ఈ పథకం కింద రూ.50 వేల వరకు పూర్తి రాయితీతో రూ. లక్షకు 90%, రూ.2 లక్షలకు 80%, రూ.4 లక్షలకు 70% రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. యువతకు స్థిర ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ పథకాన్ని పారదర్శకంగా ప్రజల విశ్వాసాన్ని పెంచే విధంగా అమలు చేయాలన్నదే ముఖ్యమంత్రి దృక్పథంగా ఉండటంతో కొంత జాప్యం అయినా ఇది అవసరమైన నిర్ణయంగా భావిస్తున్నారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర అంశాలపైనా సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికలు, ధాన్యం కొనుగోళ్ల అంశాలపై చర్చ సాగింది. ప్రతి అంశాన్నీ సమగ్రంగా అధ్యయనం చేస్తూ రాష్ట్రానికి ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సమావేశం ద్వారా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు

Also Read :  లాఠీలు విరిగినా లడాయి మానలే.. ఉద్యమం నాటి వీడియోలు వైరల్!



( Latest News | telugu-news | political | telangana)  

Advertisment
Advertisment
తాజా కథనాలు