/rtv/media/media_files/2025/06/02/aVOFQEf1JMygoNjV33p7.jpg)
Indian Poet Kaloji Narayana Rao
Kaloji Narayana Rao: 'పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది'' అని ఉద్యమమే ఊపిరిగా జీవించారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాళోజి ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుందాం.
ఆయన రచనలు మాటల తూటాలు
కాళోజీ తెలంగాణ సాయుధ పోరాటంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తన కలంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. ప్రతి నిత్యం సామాన్యుల సమస్యలు, హక్కుల పరిరక్షణ, ప్రజా శ్రేయస్సే జీవితంగా గడిపిన ప్రజాకవి కాళోజి. అచ్చమైన తెలంగాణ యాసలో ఆయన చేసిన రచనలు నిరంకుశత్వంపై, అరాచక పాలన, అసమానతలపై మాటల తూటాలు.
Also Read : తెలంగాణ ప్రజలకు షాక్.. ఆ స్కీమ్కు బ్రేక్?
/rtv/media/media_files/2025/06/02/HWrFbdxyVfJ541lLpVRS.png)
కాళోజి రచనలు సాధారణ ప్రజల జీవితాలను ప్రతిబింబించేలా ఉంటాయి. 'నా గొడవ' అనే సంకలనం పేరుతో సామాజిక సమస్యల పై ముక్కుసూటిగా స్పందిస్తూ అధికారుల పై తన అక్షర ఆయుధాలను సంధించారు. ''అన్యాయాన్ని ఎదిరిస్తేనే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తేనే నా గొడవకు ముక్తి ప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాద్యుడు'' అని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని స్ఫూర్తిని నింపారు మహాకవి కాళోజి.
Also Read : నేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
సమాజం గొడవే తన గొడవ
తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో రైతులకు, కార్మికులకు, బానిసత్వంలో అల్లాడుతున్న ప్రజల గొంతుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమకారునిగా కాళోజీ అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు అనిర్వచనీయం. అచ్చ తెలంగాణలో ఆయన చేసిన రచనలు తెలంగాణ భాషకు ఉనికిని కాపాడారు. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటారు మహాకవి కాళోజి. తెలంగాణాలో అక్షర జ్యోతిని ప్రోత్సహించాలనే ఆకాంక్షతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన మహనీయుల్లో కాళోజి ఒకరు. తెలంగాణ భాష ఉనికిని కోసం ఆయన చేసిన కృషికి గుర్తుగా ప్రతి ఏడాది ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటారు. అంతేకాదు 2024లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ గౌరవార్థం మెడికల్ యూనివర్సిటీకి కాళోజి నారాయణరావు విశ్వవిద్యాలయం అని పేరు పెట్టింది. అలాగే 1992లో భారతదేశంలోని అత్యన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఆయనను వరించింది.
Also Read : శ్రేయాస్ అయ్యర్ లగ్జరీ లైఫ్.. నెట్వర్త్ తెలిస్తే షాకే!
Also Read : JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
స్వరాజ్య సమరం సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని ఆదుకోవడంలో కాళోజీ చేసిన పోరాటం మరువలేనిది. 9 సెప్టెంబర్ 1914న కరీంనగర్ జిల్లాలోని మధిరలో జన్మించిన కాళోజీ.. చిన్నప్పటినుండే ప్రజల జీవితాన్ని అర్థం చేసుకోవాలనే ఆసక్తితో పెరిగారు. 1930లలోనే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలుపెట్టారు. బతుకంతా తెలంగాణ కోసం, సామాన్యుల కష్టాలుగా గడిపిన తెలంగాణ తొలి పొద్దు కాళోజి.
kaloji-narayana-rao | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | TELANGANA FORMATION DAY 2025