Amit shah: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అన్నారు.
సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన అమిత్ షా.. నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మమత బెనర్జీ పాలనతో బెంగాల్ ప్రజలు విసుగు చెందారని.. ఆమె సమయం ముగిసిందని తెలిపారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో అధికారం బీజేపీదేనన్నారు. అలాగే వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎవరికోసం వ్యతిరేకిస్తున్నారో మమతే తెలియాన్నారు. అందులో ఏమైన తప్పులున్నాయా ?.. ఆ చట్టం కోసం బెంగాల్ భూములను త్యాగం చేయాలా ? అని ప్రశ్నించారు. 2026 వరకే మమత వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తారని.. అప్పటిదాకే ఆమె ముఖ్యమంత్రిగా ఉంటారంటూ సెటైర్లు వేశారు. ఇదిలాఉండగా.. బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయమని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ముస్లింల ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేందుకు మమతా బెనర్జీ ఆపరేషన్ సిందూర్, వక్ఫ్ సవరణ చట్టం రెండింటినీ వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను వ్యతిరేకించి ఈ దేశంలో తల్లులు, సోదరీమణులను అగౌరవపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amit shah: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అన్నారు.
Amit shah Sensational Comments on CM Mamata Benarjee
సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన అమిత్ షా.. నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: భారత్ బహిష్కరించిన వ్యక్తితో సన్నీ మీటింగ్.. పాక్ పర్యటనపై భయపెట్టే నిజాలు!
మమత బెనర్జీ పాలనతో బెంగాల్ ప్రజలు విసుగు చెందారని.. ఆమె సమయం ముగిసిందని తెలిపారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో అధికారం బీజేపీదేనన్నారు. అలాగే వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎవరికోసం వ్యతిరేకిస్తున్నారో మమతే తెలియాన్నారు. అందులో ఏమైన తప్పులున్నాయా ?.. ఆ చట్టం కోసం బెంగాల్ భూములను త్యాగం చేయాలా ? అని ప్రశ్నించారు. 2026 వరకే మమత వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తారని.. అప్పటిదాకే ఆమె ముఖ్యమంత్రిగా ఉంటారంటూ సెటైర్లు వేశారు. ఇదిలాఉండగా.. బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయమని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Also Read: ఇక బొచ్చె పట్టుకుని అడుక్కోవద్దు.. పాక్ దుస్థితిపై ప్రధాని షాబాజ్ ఆవేదన!
మరోవైపు ముస్లింల ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేందుకు మమతా బెనర్జీ ఆపరేషన్ సిందూర్, వక్ఫ్ సవరణ చట్టం రెండింటినీ వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను వ్యతిరేకించి ఈ దేశంలో తల్లులు, సోదరీమణులను అగౌరవపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మిస్ వరల్డ్ బ్యూటీకి రొమ్ము క్యాన్సర్.. కన్నీరు పెట్టించే జర్నీ
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
mamata-benarjee | telugu-news | west bengal | amit shah