/rtv/media/media_files/2025/06/02/rCLTIOdjYKQaa1dAOM0Z.jpg)
Prof. Jayashankar
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన తన చివరి శ్వాస వరకు జై తెలంగాణ అనే నినాదాననన్ని ఆపలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అంతిమ లక్ష్యంగా ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన యోధుడు ఆయనే. తెలంగాణ ఎందుకు అవసరమో చెబుతూ.. రాష్ట్ర విభజన న్యాయబద్ధంగా జరగాలని కోరిన కీలక ఉద్యమకారుడు ప్రొ. జయశంకర్. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి ఆయన లేరు. కానీ ఆయన స్వప్నం మాత్రం ఎట్టకేలకు సాకారం అయ్యింది.
Also Read : కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !
తెలంగాణపై రచనలు
ప్రొ. జయశంకర్ 1934,ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం, అక్కంపేట్ గ్రామంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం వరంగల్లోనే సాగింది. ఆ తర్వాత MA (ఎకనామిక్స్) బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి, పీహెచ్డీ (ఎకనామిక్స్) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. 1979-81వరకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా.. అలాగే 1991-94 మధ్య కాలంలో ఆ వర్సిటీకీ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. అంతేకాదు ఆయన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తల్లడిల్లుతున్న తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంపై విస్తృత అంగీకారం నిజనిజాలు వంటి రచనలు కూడా చేశారు.
Also Read: బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులపై AICTE కీలక ప్రకటన
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో ముందుగా చెప్పిన వ్యక్తి జయశంకరే. 1950లో ఫజల్ అలీ కమిషన్ ముందు ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే మొదటిసారిగా తమ వాదనను వినిపించారు. అనంతరం వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1969 ఉద్యమంలో, అంతకంటే ముందు జరిగిన నాన్ ముల్కీ ఉద్యమ, ఇండ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే సమయంలో జయశంకర్.. కేసీఆర్కు సలహాదారుడిగా, మార్గదర్శిగా ఉన్నారు.
''ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోవద్దు అని నిరంతరం పోరాడారు. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వరంగల్ మర్కాజి స్కూల్ లో చదివేవారు. అక్కడికి ఆంధ్ర నుండి అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి కొందరు వ్యక్తులు వచ్చి తెలంగాణ భాష కుల్లిపాయింది,… pic.twitter.com/MYAT3IcKmF
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 2, 2024
కేసీఆర్ అంటే అభిమానం
ఆ సమయంలో మిగతా నేతలకు తెలంగాణ గురించి లోతైన అవగాహన ఉండేది కాదు. కేసీఆర్కు మాత్రమే ఈ పరిజ్ఞానం ఉండటంతో జయశంకర్కు ఆయనంటే అభిమానం ఏర్పడింది. అప్పట్లో కేసీఆర్ను ఆయన రావుసాబ్ అంటూ పిలిచేవారు. అంతేకాదు కేసీఆర్ బహిరంగ వేదికలపైనే జయశంకర్కు పాదాభివందనం చేసేవారు.
❇️ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 👇🏼
— Mission Telangana (@MissionTG) August 5, 2024
🔸నాటి ఉద్యమంతో పాటు స్వరాష్ట్ర ప్రగతిలో వారందించిన స్ఫూర్తిని కొనసాగించాం
🔸సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే ప్రొఫెసర్ జయశంకర్ సార్కు మనం అందించే… pic.twitter.com/VHPRFwEvKy
మిగతా నేతలెవరికీ తెలంగాణ గురించి లేనంత లోతైన పరిజ్ఞానం కేసీఆర్కు ఉండటంతో.. ఆయనంటే జయశంకర్కు అభిమానం ఏర్పడింది. అందుకే ఆయన్ను రావు సాబ్ అని పిలిచేవారు. కేసీఆర్ బహిరంగ వేదికలపైనే ఆయనకు పాదాభివందనం చేసేవారు. దీన్ని బట్టే ప్రొఫెసర్ జయశంకర్ అంటే ఆయనకు ఎంతటి అభిమానమో అర్థం చేసుకోవచ్చు. శనివారం ఉపవాసాన్ని, తెలంగాణ నినాదాన్ని ఎప్పటికీ విడిచిపెట్టబోనని జయశంకర్ తరచుగా చెబుతుండేవారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో కూడా జయశంకర్కు మంచి పరిచయం ఉండేది. 1991లో ఆయన కాకతీయ వర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వర్సిటీలో నిర్వహించే కాన్వోకేషన్కు రావాలని ఆయనకు ఫోన్ చేశారు జయశంకర్. ఆయన రిక్వెస్ట్తో వెంటనే అంగీకరించిన మన్మోహన్ సింగ్ ఆ వేడుకకు హాజరయ్యారు.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
విశాలాంధ్రకు వ్యతిరేకం
ఇక 1952 నాన్ ముల్కీ ఉద్యమం నుంచి సమరశీల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన జయశంకర్. అప్పట్లో ఎవరూ మాట్లాడేందుకు సాహసించని సమయంలో 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన ధీశాలి ఆయనే. 1953లో స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ (SRC) ఏర్పడింది. మొదటిసారిగా ఈ కమిషన్ ఎదుట హాజరైన జయశంకర్.. విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తన వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ విశ్లేషించారు.
అయితే 1996 మలిదశ తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ విద్యావంతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయడంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ పార్టీకి ముఖ్య సిద్ధాంతకర్తగా వ్యవహరించిన ఆయన.. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా TRSను మార్చి, దానికి ఉద్యమ స్వరూపాన్ని అందించండలో ఆయన పాత్రే కీలకం.
అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ అంటరానితనం ఉండకూడదని.. అందరితో కలిసి పనిచేస్తానని చెప్పిన వ్యక్తి జయశంకర్. ఉద్యమంలో అనేక ప్రవాహాలు ఉంటాయని.. అవకాశం ఉంటే కలిసి పనిచేయాలని, కుదరకుంటే సమన్వయంతో లేదా సహకారంతో పనిచేయాలని అదీ కుదరకుంటే ఒకరినొకరు నిందించుకోకుండా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూడక ముందే 2011 జూన్ 21న క్యాన్సర్తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కానీ తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారు.
Also Read: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు
telangana-formation-day | telugu-news | professor-jayashankar | rtv-news