/rtv/media/media_files/2025/06/01/d5QMmyGCFtrObJszCtPt.jpg)
chicken price hike over covid effect
Covid Effect: కరోనా ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత వారం రోజుల్లో రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగినట్లు వ్యాపారులు, వినియోగదారులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బ్రాయిలర్ చికెన్ ధర రూ. 260 నుంచి రూ. 280 వరకు పలుకుతోంది. కొంతమంది వినియోగదారుల ప్రకారం, బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఈ ధర రూ. 300 కు దాటినట్టు సమాచారం.
Also Read : Miss World Opal Suchata: మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి థాయ్ మహిళ – ఓపల్ గురించి 10 రహస్యాలు!
కరోనా ఎఫెక్ట్..
అయితే తెలంగాణ, ఏపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రోటీన్ ఫుడ్.. చికెన్, గుడ్ల వినియోగాన్ని పెంచారు. దీంతో చికెన్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.ఇక వ్యాపారాలు కూడా ఇదే ఛాన్స్ అని ధరలు భారీగా పెంచారు. కరోనా మాత్రమే కాదు బ్రాయిలర్ కోళ్ల పోషణ వ్యయం, రవాణా ఖర్చులు కూడా చికెన్ ధరలు పెరగడానికి కారణాలు కావచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధరలు పెరిగినప్పటికీ.. ఆరోగ్యం దృష్ట్యా ప్రజలు చికెన్ షాపుల ముందు బారులు తీరుతున్నారు.
Also Read: Squid Game 3 Trailer: మైండ్ బ్లోయింగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘స్క్విడ్గేమ్ 3’ ట్రైలర్
తెలుగు రాష్ట్రాల్లో కేసులు
తెలంగాణలో ఇప్పటి వరకు ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదే సమయంలో ఏపీలో ఒక్కరోజే నలుగురికి వైరస్ సోకింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 23కు చేరింది. కాగా వైరస్ వ్యాప్తిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read : ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!