Paris Riots: పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. 192మందికి పైగా

ఫ్రాన్స్‌లో ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు గెలచింది. దీంతో పారిస్‌ వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓడిపోయిన జట్టుతో అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందారు. 197 మంది గాయపడ్డారు.

New Update
2 dead, officer in coma, and over 500 arrested after PSG win causes clashes in France

2 dead, officer in coma, and over 500 arrested after PSG win causes clashes in France

ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ (PSG) ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు విజయం సాధించింది. దీంతో వేలాది మంది అభిమానులు వీధుల్లో సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఓడిపోయిన జట్టు అయిన 'ఇంటల్ మిలన్'  అభిమానులకు..  పారిస్ సెయింట్-జర్మైన్ అభిమానాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఇది ఘర్షణలకు దారి తీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 192 మంది గాయాపాలయ్యారు. అంతర్జాతీయ మీడియా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

పారిస్ వీధుల్లో హింసాత్మకంగా ఘర్షణలు చెలరేగడంతో భద్రతా దళాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు టీయర్‌గ్యాస్‌లు వేశారు. ఈ క్రమంలోనే ఆందోళకారులు పలు వాహనాలను తగలబెట్టారని.. అలాగే బస్‌ షెల్డర్లు ధ్వంసం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వేలాదిమంది స్టోర్లు, దుకాణాల్లో చొరబడి అందులో ఉన్న వస్తువులను దోచుకున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: రష్యాకు బిగ్ షాక్.. 40 విమానాలను నాశనం చేసిన ఉక్రెయిన్

భద్రతా బలగాలు అడ్డుకోవడానికి వస్తే వాళ్లపై కూడా దాడులు చేసినట్లు తెలిపారు. ఫుట్‌బాల్‌ అభిమానుల్లో అసాంఘిక శక్తులు కూడా కలిసిపోయి.. ఈ దారుణాలకు పాల్పడ్డారని అధికారులు చెప్పారు. ఈ ఘర్షణలకు కారణమైన వాళ్లలో 559 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.  

telugu-news | rtv-news | national-news

Advertisment
Advertisment
తాజా కథనాలు