/rtv/media/media_files/2025/06/02/TRQRo2PzONu0VQzoccDO.jpg)
JEE Advanced Results out
జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ కాన్పుర్ ఈ ఫలితాలు వెల్లడించింది. ఫలితాలు తెలుసునేందుకు https://results25.jeeadv.ac.in/ పై క్లిక్ చేయండి.దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read: ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి
JEE Advanced Results 2025
దేశవ్యాప్తంగా 1.80 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యారు. గతేడాది అడ్వాన్స్డ్లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కుల ఆధారంగా 48, 248 మందికి జోసా కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. వీళ్లు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి గాను 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
ఇక జూన్ 3న సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు విడుతల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఐఐటీ కాన్పుర్ షెడ్యూల్ విడుదల చేసింది.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
Also Read: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు
telugu-news | rtv-news | jee-advanced