/rtv/media/media_files/2025/04/22/8MLy0IWUmwC4FqjjuAQ5.jpg)
Stock Market Today
ముందు రెండు నష్టాల్లో ఉన్న భారత స్టాక్ మార్కెట్లు నిన్న ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. కానీ ఇవాళ ఉదయానికి పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది. ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలను నిన్న నిలిపేయాలని నిన్న ట్రేడ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఇవాళ మళ్ళీ మరో కోర్టు ఆ తీర్పు నిలిపేసింది. ఈ ప్రభావం మార్కెట్ల మీద పడింది.
సెన్సెక్స్లోని 30 స్టాక్లలో 15 లాభపడగా.. 15 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, మారుతి, సన్ ఫార్మా షేర్లు 1% పెరిగాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ షేర్లు దాదాపు 2% క్షీణించాయి. మరోవైపు నిఫ్టీలోని 50 స్టాక్స్లో 35 లాభపడ్డాయి.. 15 నష్టపోయాయి. NSEలో ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా పడిపోయాయి. అదే సమయంలో, మెటల్, ఫార్మా మరియు ప్రభుత్వ బ్యాంకుల షేర్లలో పెరుగుదల ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లు కూడా పతనం..
ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ దాదాపు 550 పాయింట్లు తగ్గి 37,885 దగ్గర ఉండగా.. కొరియా కోస్పి 20 పాయింట్లు తగ్గి 2,700 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ సూచీ 350 పాయింట్లు తగ్గి 23,224 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 10 పాయింట్లు తగ్గి 3,353 వద్ద ముగిసింది. ఇక యూఎస్ కు చెందిన డౌ జోన్స్ 117 పాయింట్లు పెరిగి 42,216 దగ్గర, నాస్డాక్ కాంపోజిట్ 75 పాయింట్లు పెరిగి 19,176 దగ్గర ఉండగా..S&P 500 కూడా 24 పాయింట్లు పెరిగి 5,912 వద్ద ముగిశాయి.
today-latest-news-in-telugu | stock-market | sensex-today | nifty
Also Read: Punjab: భీకర యుద్ధం..అయినా భయపడకుండా పదేళ్ల పిల్లాడు ఆర్మీకి సాయం..