Covid-19: కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Rinku-Priya Engagement: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు

క్రికెటర్ రింకు సింగ్ , ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు లక్నోలోని సెంట్రమ్ లో జరగనుంది. దీనికి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో సహా 300 మంది అతిథులు హాజరు కానున్నారు.

Bangalore Stampede: బెంగుళూరు తొక్కిసలాటలో వారికి రూ.25లక్షలు పరిహారం

బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచింది. 11మంది మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

Manipur: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మైటీలు ఆందోళనలకు దిగారు. ఇంఫాల్‌లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.

Bengaluru: బెంగళూరు తొక్కిసలాటలో కుట్రకోణం? ఎన్ఐఏ దర్యాప్తు

 బెంగళూరు ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో కుట్రకోణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు పాల్గొనడం..మ్యాచ్ కు ముందే విజయోత్సవ సంబరాల కోసం అనుమతి అడగడం లాంటివి సందేహాలకు దారి తీస్తున్నాయి.

Poverty: ఇండియాలో గణనీయంగా తగ్గిన పేదరికం..వరల్డ్ బ్యాంక్

భారత్ లో గత పదేళ్ళల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని అని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 5.3 శాతానికి తగ్గిందని తాజా ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడించింది. 

Web Stories
web-story-logo jamun tree leaves వెబ్ స్టోరీస్

నేరేడు ఆకుల‌తో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo oukitel wp55 pro5 వెబ్ స్టోరీస్

108MP కెమెరా, 11,000mAh బ్యాటరీతో కొత్త మొబైల్ లాంచ్!

web-story-logo Subhashree Rayaguru engagement  7th pic వెబ్ స్టోరీస్

బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ కాబోయే భర్తను చూశారా?

web-story-logo Ajwain Leaves Benefits వెబ్ స్టోరీస్

ఈ ఆకుతో అనారోగ్య సమస్యలకు విముక్తి

web-story-logo nitha ambani వెబ్ స్టోరీస్

గోల్డ్‌ చీరలో నీతా అంబానీ అందాలు సూపర్

web-story-logo Sapodilla వెబ్ స్టోరీస్

సపోటాతో శరీరానికి అద్భుత ప్రయోజనాలు

web-story-logo Green Tea వెబ్ స్టోరీస్

రోగాలను తరిమి కొట్టే టీ ఇదే

web-story-logo Mushrooms వెబ్ స్టోరీస్

పుట్టగొడుగులు తింటే ఫుల్ ఎనర్జీ వస్తుందా..?

web-story-logo teeth Health వెబ్ స్టోరీస్

గ్రీన్ టీ తాగడం వల్ల పళ్లు పుచ్చిపోవా..?

web-story-logo sorghum roti వెబ్ స్టోరీస్

జొన్న రొట్టెలతో షుగర్ తగ్గుతుందా..?

Advertisment

Israel: గాజాలో ఆస్పత్రి కిందే హమాస్‌ సొరంగం.. సంచలన వీడియో

గాజాపై ఇజ్రాయెల్‌ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఓ సంచలన వీడియో బయటపడింది. ఖాన్ యూనస్‌లోని ఓ కీలకమైన ఆస్పత్రి కిందే హమాస్‌ సొరంగాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం వెల్లడించింది.

Trump Decisions: 2 నెలల్లోనే ట్రంప్‌కు 5సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు

ట్రంప్ 2వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. గడిచిన 2నెలల్లో ట్రంప్ 5 నిర్ణయాలను అమెరికాలో కోర్టు వ్యతిరేకించాయి. వలసవిధానం, హర్వర్డ్ యూనివర్సిటీ లాంటి పలు అంశాలపై పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగింది.

LA: రణ రంగంగా లాస్ ఏంజెలెస్..2వేల మంది నేషనల్ గార్డ్స్ ను దింపిన ట్రంప్

  ఇమ్మిగ్రేషన్ దాడులను ఖండిస్తూ లాసం ఏంజెలెస్ ఫెడరల్ బిల్డింగ్ బయట ఆందోళనకారులు చేస్తున్న నిరసన ఉద్రిక్తమవుతోంది. దీనినకి అదుపు చేసేందుకు ట్రంప్ 2 వేల మంది నేషనల్ గార్డులను దింపారు.

BIG BREAKING: ట్రంప్ పై తిరుగుబాటు.. ఆందోళనకారులపై ఫైరింగ్.. అమెరికాలో హై టెన్షన్

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఫెడరల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమ వలసదారులను పంపించడానికి ప్రయత్నించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిని అణిచివేయడానికి ట్రంప్ 2 వేల మంది నేషనల్ గార్డ్స్ ను పంపించారు. 

Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..హత్యాయత్నం

కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తున్న మిగ్యుల్ ఉరిబ్ టర్బేపై హత్యాయత్నం జరిగింది. ఒక ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. మిగ్యుల్ తలకు లేదా మెడకు బుల్లెట్ తగిలి ఉండవచ్చని తెలుస్తోంది.

Advertisment

TG Cabinet Expansion: తెలంగాణ కేబినెట్‌ మంత్రివర్గ విస్తరణ.. లైవ్‌ అప్‌డేట్స్‌

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల పేర్లు ప్రకటించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వారికి నా అభినందనలు అన్ని ట్వీట్ చేశారు.

Cabinet Expansion: కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి జ్వాలలు.. మరో 12 మంది...

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తమకు అవకాశం వస్తుందని ఆశిస్తూ వస్తున్న పలువురు నేతలకు నిరాశే మిగిలింది. పదవులు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Cabinet Expansion : ఇంకా మిగిలే ఉంది... కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఈ రోజు జరిగింది. అయితే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న పలువురు తమకు పదవులు దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది.

Telangana Cabinet: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌ లో రాష్ట్రగవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

BIG BREAKING : వెక్కి వెక్కి ఏడ్చిన KCR (VIDEO)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి ఆయన నివాసానికి వెళ్లారు. గోపీనాథ్ మృతదేహాన్ని చూసి కేసీఆర్ వెక్కి వెక్కి ఏడ్చారు.

Kavvampally Satyanarayana : పాపం కవ్వంపల్లి

రెండో విడత మంత్రి పదవుల విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి వరించింది. నిజానికి మంత్రివర్గ విస్తరణలో ముందుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి మానకోండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం సాగింది.

Advertisment

AP PGCET-2025 EXAM: రేపట్నుంచి AP PGCET 2025 పరీక్షలు - ఫుల్ షెడ్యూల్ ఇదే

ఏపీ పీజీసెట్ -2025 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్ష కోసం 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 25వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఇందులో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

AP Crime: ఏపీలో తీవ్రవిషాదం. .ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు

అల్లూరి జిల్లా అరకు లోయలోని ఏజెన్సీ ప్రాంతంలోని డుంబ్రిగూడ మండలం గుంటసీమ దగ్గర కొంతమంది బాలురు ఈతకు వెళ్లారు. అయితే చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండటం, లోతు కూడా ఉండటంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి చనిపోయారు.

Labor Law: ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచారు. ఈ మేరకు కార్మిక చట్టాల్లో సవరణ చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 9గంటలు గరిష్టంగా పని చేసే సమయాన్ని ఇప్పుడు 10గంటలకు పెంచారు.

Inter Supplementary Results: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం.. తెలంగాణ ఎందుకు అడ్డుచెబుతోంది ?

బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుచెబుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఇది ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది.

Advertisment

PhonePe: ఇకపై కీప్యాడ్ ఫోన్లలోనూ ఫోన్‌పే.. కంపెనీ అదిరిపోయే ఫీచర్!

కీప్యాడ్‌ఫోన్ వినియోగదారుల కోసం ఫోన్‌పే యూపీఐ చెల్లింపు సేవల్ని తీసుకురానుంది. జీఎస్‌పే టెక్నాలజీ కన్వర్‌జేషనల్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ గప్‌చుప్‌ను కొనుగోలుచేసింది. రానున్న త్రైమాసికాల్లో భారత్‌లో కీప్యాడ్ ఫోన్‌ల కోసం UPIమొబైల్‌ యాప్‌ను ప్రారంభించనుంది.

Tatkal Tickets: మారిన తత్కాల్ బుకింగ్ రూల్స్.. ఆ ప్రూఫ్ ఉండాల్సిందే.. రైల్వే కీలక ప్రకటన!

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారత రైల్వే ఈ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా నిజమైన ప్రయాణీకులు అవసరమైన సమయంలో సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment