/rtv/media/media_files/2025/06/08/awVxlanZ38enzpq7oPku.jpg)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి మాధాపూర్లోని ఆయన నివాసానికి వెళ్లారు. గోపీనాథ్ మృతదేహాన్ని చూసి కేసీఆర్ దు:ఖం ఆపుకోలేకపోయారు. ఆయనతో ఉన్న అనుభందాన్ని తలుచుకొని కేసీఆర్ వెక్కి వెక్కి ఏడ్చారు. రాష్ట్రం ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపనుంది.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. pic.twitter.com/jZEogbyORV
— Mission Telangana (@MissionTG) June 8, 2025
టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్, గోపీనాథ్ కలిసి పని చేశారు. తర్వాత మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్లో చేరి కేసీఆర్కు ఇంకా దగ్గరైయ్యారు. కేసీఆర్ మనవడు హిమాన్షు, మాగంటి గోపీనాథ్ కుమారుడు ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా ఆ రెండు కుటుంబాల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2సార్లు MLAగా గెలిచారు. మరో మూడేళ్ల పదవి కాలం ఉండగానే మాగంటి అకస్మాత్తుగా మరణించారు. పార్టీలో పలువురు నాయకులు మాధాపూర్లో మాగంటి ఇంటికి చేరుకొని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపుతున్నారు. మాగంటి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
ఇక సెలవు 🥺🥺@MGNMLA pic.twitter.com/vEbZG9GQ7d
— 𝗠𝗔𝗛𝗘 𝗖𝗟𝗜𝗖𝗞𝗘𝗥 𝗕𝗥𝗦 (@brs_mahe) June 8, 2025
సోదరుడు, మృదు స్వభావి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు ఉదయం మృతి చెందడం చాలా బాధాకరం.. మంచి నాయకుడిని కోల్పోయాం.
— Mission Telangana (@MissionTG) June 8, 2025
కుటుంబసభ్యుల ఆలోచన మేరకు మహాప్రస్థానంలో ఇవాళ సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
గోపీనాథ్ ఇంటి నుండి ర్యాలీగా అంతిమ యాత్ర… pic.twitter.com/BCNDau0hNG
brs-mla-maganti-gopinath | maganti gopinath mla | kcr | brs-mla | latest-telugu-news