🔴Live News Updates: కోతులపైకి గొడ్డలి విసిరాడు.. మెడకు తగలడంతో కొడుకు మృతి

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Shreyas Iyer: కప్ గెలవకపోయినా టాప్ లో పంజాబ్..సక్సెస్ ఫుల్ కెప్టెన్ శ్రేయస్

మూడు వేర్వేరు జట్లు...మూడింటినీ ఫైనల్స్ కు చేర్చాడు. ఈ ఘనత ఒక్క పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కే దక్కింది. ఈసారి ఫైనల్ లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన టేబుల్ టాప్ మాత్రం పంజాబ్ కింగ్స్ ను నిలబెట్టాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. 

Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

లాస్ట్ ఇయర్ కొలకత్తా నైట్ రైడర్స్ ఛాంపియన్.. అప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. షారుక్ ఖాన్ ఈసారి అయ్యర్ ను వదులుకున్నాడు.. పంజాబ్ కెప్టెన్ గా అయ్యర్ జట్టును టాప్ లోకి తీసుకువచ్చాడు. పంజాబ్ ను మొట్టమొదటి సారి ఫైనల్ కు చేర్చాడు. మూడు వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. 2020 సీజన్‌లో దిల్లీ, 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను టైటిల్‌ పోరుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ను కూడా ఫైనల్కు చేర్చాడు. దీంట్లో బెంగళూరు చేతిలో ఓడిపోయినా కూడా రన్ రేట్ లో పంజాబ్ ను టాప్ లో నిలబెట్టాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా పంజాబ్ టేబుల్ టాప్ లోనే ఉంది అంటే ఆ క్రెడిట్ మొత్తం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి మాత్రమే దక్కుతుంది.

Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

 కుర్రాళ్ళను ఒక్క తాటిపైకి తెచ్చి..

సూపర్ స్ట్రైక్‌రేట్‌తో  ఈ సీజన్ మొత్తం అద్భుత ఫామ్ కనబర్చాడు శ్రేయస్. తన కెప్టెన్సీ స్కిల్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లాడు. 41 బంతుల్లో 87 పరుగులు బాది తన పవరేంటో చూపించాడు. అనుభవం లేని కుర్రాళ్ళను ఒక్కతాటిపై చేర్చి బ్యాటర్లతో పరుగులను, బౌలర్లతో వికెట్లను రాబట్టాడు. ఐపీఎల్ లో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లు ఎవరంటే ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ పేర్లు చెబుతారు. వీళ్ళిద్దరూ జట్టుకు ఐదు సార్లు కప్ ను అందించారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ కొట్టేశాడు. ఇతను వేర్వేరు జట్లకు సారధిగా వ్యవహరిస్తూ.. ప్రతి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లి తాను సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. గత సీజన్లో కోలకత్తాకు కప్ ను కూడా అందించాడు. ఈ సారి ఫైనల్ లో చివర వరకూ కూడా పోరాటపటిమను చూపించాడు. 

Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్

Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..

  • Jun 04, 2025 16:40 IST

    కోతులపైకి గొడ్డలి విసిరాడు.. మెడకు తగలడంతో కొడుకు మృతి

    ఉత్తరప్రదేశ్‌లో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. కోతుల గుంపును తరిమికొట్టడానికి ఓ తండ్రి విసిరిన గొడ్డలి దెబ్బకు రెండేళ్ల కుమారుడు చనిపోయాడు. మొరాదాబాద్‌లో ఆరవ్ అనే బాలుడు ఇంటి లోపల ఆడుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

    son monkeys



  • Jun 04, 2025 15:51 IST

    నితీష్కు బిగ్ షాక్.. బీహార్‌లో గెలిచేది అతనే.. సంచలన సర్వే

     బీహార్‌ సీఎం కోసం సీ - ఓటర్ సర్వే తాజాగా సర్వే నిర్వహించింది.  సీ- ఓటర్‌ సర్వేలో లీడ్‌లో RJD నేత తేజస్వి యాదవ్ టాప్ లో నిలిచారు.  సీఎంగా తేజస్వియాదవ్‌కు 36.9 శాతం మంది ప్రజల మద్దతు తెలిపారు.

    bihar-cm-survey
    bihar-cm-survey

     



  • Jun 04, 2025 14:59 IST

    ఏపీలో విషాదం.. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి

    కాకినాడలోని రేచర్లపేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి చెందారు. మృతురాలు రమ్యదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     kakinada crime news
    kakinada crime news

     



  • Jun 04, 2025 13:09 IST

    సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

    RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

    RTV New APP
    RTV New APP

     



  • Jun 04, 2025 12:12 IST

    TG CRIME : ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. ఫుడ్ పాయిజన్ తో ఒకరు మృతి...మరో 70 మంది..

    హైదరాబాద్‌ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలకలం చెలరేగింది.  ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఒకరు మృతి చెందగా, 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    Erragadda Mental Hospital



  • Jun 04, 2025 11:14 IST

    RCB విజయంపై.. జట్టు మజీ ఓనర్ విజయ్ మాల్యా రియాక్షన్ ఇదే..!

    IPL 2025లో RCB విజయంపై ఆ టీం వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా స్పందించాడు. RCB విజయం సాధించినందుకు అభినందనలు! ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయమని Xలో పోస్ట్ చేశారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆరోపణల కారణంగా ఆయన 2016లో దేశం విడిచి వెళ్ళిపోయారు.

    Vijay Mallya



  • Jun 04, 2025 11:14 IST

    BIG BREAKING: 1100 kg TNT బాంబులతో రష్యా బ్రిడ్జ్‌ని కూల్చేసిన ఉక్రెయిన్

    రష్యాను క్రిమియాతో కలిపే బ్రిడ్జిను ఉక్రెయిన్ పేల్చేసింది. నీటిలో బాంబ్ పెట్టి ఉక్రెయిన్ ఆర్మీ భారీ పేలుడు జరిపింది. బ్రిడ్జి పిల్లర్లకు 11 వందల కేజీల TNT బాంబు అమర్చారు.  ఇప్పటివరకూ ఉక్రెయిన్ 3 సార్లు బ్రిడ్జిని కూల్చివేసింది.

    Ukraine Strikes Crimea Bridge🔴LIVE: బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్ | Russia Ukraine War | Putin |RTV



  • Jun 04, 2025 11:13 IST

    Biryani: పిల్లలూ ఎంజాయ్, పండగో.. అంగన్‌వాడీ మెనూలో బిర్యానీ

    కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ ప్రకటించిన అంగన్‌వాడీ కొత్త మెనూలో ఎగ్ బిర్యానీ, పులావ్ వంటి టేస్టీ వంటకాలు ఉన్నాయి. ఓ పిల్లాడు ఉప్మాకు బదులుగా బిర్యానీ కావాలని కోరిన వీడియో వైరల్ అయ్యింది. అది ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

    _Kerala Anganwadi Menu



  • Jun 04, 2025 11:12 IST

    Shubhanshu Shukla ISS: ఇండియన్ ఆస్ట్రోనాట్ ISS ప్రయాణం వాయిదా

    ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ISS ప్రయాణం జూన్10కి వాయిదా పడింది. ఇండియా తరుపున ISSకి వెళ్తున్న ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఆయన. యాక్స్- 4 మిషన్‌లో శుక్లా పైలట్‌గా ఉన్నారు. ఈ ప్రయోగం జూన్ 10 సాయంత్రం 5:52 గంటలకు ప్రారంభించనున్నారు.

    Captain Subhanshu Shukla's space mission
    Captain Subhanshu Shukla's space mission

     



  • Jun 04, 2025 09:58 IST

    China Dangerous Fungus: మరో డేంజరస్ వ్యాధిని పుట్టించిన చైనా.. అమెరికాపై ప్రయోగం

    చైనా ల్యాబ్‌ నుంచి మరో డేంజరస్ ఫంగస్ బయటకొచ్చింది. పుసారియమ్ గ్రామినేరియమ్ అనే ఫంగస్‌ని డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేసింది. ఈ ప్రమాదకరమైన ఫంగస్ అమెరికాకు అక్రమంగా రవాణ చేస్తుండగా ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు.

    fungus into the US



  • Jun 04, 2025 09:54 IST

    USA: స్టీల్, అల్యూమినిమంపై 50 శాతం సుంకాలు...ఇవాల్టి నుంచే అమలు

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో మరోసారి షాక్ ఇచ్చారు. స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలను పెంచుతూ సంతకం చేశారు. ఇవి ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది.

    Trump
    Trump

     



  • Jun 04, 2025 09:52 IST

    RCB Advertisement: ఆర్సీబీ కలను నిజం చేసిన యాడ్

    ఈసారి ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని ముందే గెస్ చేశారు. అందుకు తగ్గట్టుగా యాడ్స్ కూడా చేశారు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు ప్రసారం చేసిన ఓ యాడ్ ఇప్పుడు ఆర్సీబీ గెలిచాక మళ్ళీ పాపులర్ అవుతోంది.

    ipl
    RCB Advertisment

     



  • Jun 04, 2025 09:51 IST

    IPL 2025: ఐపీఎల్ లో ఆర్సీబీకి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

     ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని అందుకుంటోంది. మొత్ంత 20 కోట్లు ఈ జట్టు సొంతం అయ్యాయి. రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి.

    IPL
    RCB

     



  • Jun 04, 2025 09:50 IST

    IPL Toppers: ఐపీఎల్ ఈ సీజన్ టాపర్లు వీళ్ళే..

    ఐపీఎల్ 2025 ముగిసింది. ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాంతో పాటూ టోర్నీ మొత్తానికి మరికొంత మంది టాపర్లుగా నిలిచారు. ఎవరెవరు ఏమేమీ గెలుచుకున్నారు...కింది ఆర్టికల్ లో..

    RCB WINNING 9TH PIC
    RCB WINNING MOMENTS

     



  • Jun 04, 2025 06:57 IST

    Virat Kohli: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్

    పద్దెనిమేళ్ళగా ఒక జట్టును ఎవరైనా వదలకుండా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ గెలిచినా గెలవకపోయినా టీమ్ తో ఉండి ముందుకు నడిపించాడు. అందుకే బెంగళూరు విజయం కాదు విరాట్ కోహ్లీ విజయం..

    ipl
    Virat Kohli

     



  • Jun 04, 2025 06:56 IST

    Rajat Patidar: కెప్టెన్ మారాడు కథ మారింది..

    పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ కల ఈ ఇయర్ నెరవేరింది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్ళారు..కెప్టెన్లు మారారు. కానీ ఈ ఏడాది కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ ఒక్కడికే కప్ ను గెలిచిన ఘనత దక్కింది. 

    ipl
    RCB captain Rajat Patidar

     



  • Jun 04, 2025 06:56 IST

    RCB: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

    ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ నిరీక్షత ర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్ ను గెలుచుకుంది. పంజాబ్ పై ఆరు పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో బెంగళూరు సంబరాలు అంబరాన్నంటాయి.

    ipl



  • Jun 04, 2025 06:55 IST

    IPL FINALS: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

     ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ ఈ సాలా కప్ నమ్దే కల నెరవేరింది. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఐపీఎల్ 18 సీజన్ కప్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయగర్వంతో ఎత్తుకుంది. ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.

    ipl
    RCB

     



Advertisment
Advertisment
తాజా కథనాలు