/rtv/media/media_files/2025/06/08/ack7NB1vQ1WI3crwxxQh.jpg)
Covid 19
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ డేటా ప్రకారం చూసుకుంటే.. జూన్ 8న ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133లకు చేరింది. గత 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు.
Also Read: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు
Also Read : మీరు కాలేయ రోగి అయితే మీ ఆహారంలో బీట్రూట్ రసాన్ని చేర్చుకోండి.. ఎందుకంటే!
India Reports 6 Covid-19 Deaths In 24 Hours
కేరళలో అత్యధికంగా 1950 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. డేటాబోర్డులో చెప్పిన సమాచారం ప్రకారం.. కేరళలో 1950, గుజరాత్ 822, పశ్చిమ బెంగాల్ 693, ఢిల్లీ 686, మహారాష్ట్ర 595, కర్ణాటక 366, ఉత్తరప్రదేశ్ 219, తమిళనాడు 194 కేసులతో పాటు ఇంకా ఇతర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే అరుణాచల్ప్రదేశ్, మిజోరాంలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
Also Read: రణ రంగంగా లాస్ ఏంజెలెస్..2వేల మంది నేషనల్ గార్డ్స్ ను దింపిన ట్రంప్
అయితే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలగిస్తోంది. ప్రస్తుతం కేసుల పెరుగుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ సబ్వేరియంట్లు, లీనియోజ్ల ఎగువ శ్వాసకోస వ్యవస్థ (అప్పర్ రెస్టిరీ) పైనే ప్రభావం చూపుతున్నందున భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు తెలిపారు. 2020లో చైనాలో మొదటిసారిగా బయటపడ్డ కరోనా ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2021లో వచ్చిన సెకండ్ బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..హత్యాయత్నం
rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | Covid-19 Cases | covid-19-updates | new covid-19 variant | corona