Bengaluru: బెంగళూరు తొక్కిసలాటలో కుట్రకోణం? ఎన్ఐఏ దర్యాప్తు

 బెంగళూరు ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో కుట్రకోణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు పాల్గొనడం..మ్యాచ్ కు ముందే విజయోత్సవ సంబరాల కోసం అనుమతి అడగడం లాంటివి సందేహాలకు దారి తీస్తున్నాయి.

New Update
Bengaluru Stampede

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదయింది. జిల్లా అధికారి జగదీశ్‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌ విచారణ కొనసాగుతోంది. మరోవైపు సీఐడీ ఎస్పీ శుభన్విత నేతృత్వంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఎన్ఐఏ కూడా సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక తొక్కిసలాట అకస్మాత్తుగా జరిగిందా..లేక ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు జరుపనుంది.  విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు పాల్గొనడం కూడా అనుమానాలకు దారి తీస్తోంది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడానికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎ.శంకర్‌, కోశాధికారి ఈఎస్‌ జయరాం తమ పదవులకు రాజీనామా చేశారు.  

మ్యాచ్ గెలవక ముందే అనుమతి..

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రాత్రి 7.30గంటలకు ప్రారంభం అయింది. అయితే అంతకు ముందు ఆర్సీబీ విజయోత్సవాల కోసం  అనుమతి కోరుతూ కబ్బన్‌ పార్క్‌ పోలీసులకు వినతిపత్రం ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమం నిర్వహిస్తామని అడిగింది. మ్యాచ్‌ గెలవడానికి ముందే విజయోత్సవాలకు అనుమతి కోరడంపై కేంద్రమంత్రి కుమారస్వామి అనుమానం వ్యక్తం చేశారు. విధాన సౌధ ఎదుట కూడా కార్యక్రమం నిర్వహిస్తామని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌కు కూడా వినతి పత్రం ఇచ్చారు. దీనంతటికీ కారణం, తొక్కిసలాటలో 11మంది మృతి చెందడానికి సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌, హోంమంత్రి పరమేశ్వర్‌ కారణమని బీజేపీ ఆరోపిస్తోంది.  కబ్బన్‌పార్క్‌ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది.

Also Read: Poverty: ఇండియాలో గణనీయంగా తగ్గిన పేదరికం..వరల్డ్ బ్యాంక్

Advertisment
Advertisment
తాజా కథనాలు