/rtv/media/media_files/2025/01/17/UjUVz50TsuB8fNZ5jUkL.jpg)
క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ లు పెళ్ళి చేసుకోనున్నారని అందరికీ తెలిసిందే. దాని కంటే ముందు ఈరోజు వారిద్దరి ఎంగేజ్ మెంట్ లక్నోలో జరగనుంది. ఇద్దరు హై ప్రొఫైల్ వ్యక్తులే కాబట్టి నిశ్చితార్థాన్ని కూడా గ్రాండ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు లక్నోలోని సెటంరమ్ ఫైవ్ స్టార్ హోటెల్ వేదిక కానుంది. దీనికి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో సహా 300 మంది అతిథులు హాజరు కానున్నారు. ఇందులో మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పియూష్ చావ్లా, యుపి రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ కూడా ఉన్నారు.
గ్రాండ్ గా నిశ్చితార్థం..
మరోవైపు రింకు సింగ్ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి నిన్న రాత్రి హోటల్ కు చేరుకున్నారు. సెంట్రల్ హోటల్లో జరిగే రింగ్ వేడుక కోసం 15 గదులు బుక్ చేయబడ్డాయి. వీటిలో 5 గదులు రింకు స్నేహితుల కోసం రిజర్వు చేశారని తెలుస్తోంది. ఈ నిశ్చితార్ధానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 300 మంది అతిథులకు ప్రత్యేక పాస్తో ప్రవేశం కల్పించబడుతుంది. ఈ పాస్లో బార్కోడ్ స్కానింగ్ వ్యవస్థ ఉంది. నిశ్చితార్థంలో లక్నో వంటకాలను స్పెషల్స్ గా పెట్టనున్నారు. స్టార్టర్లలో యూరోపియన్, చైనీస్, ఆసియన్, ఇండియన్ కూడా ఉంటాయి. అయితే మెయిన్ గా అవధి వంటకాలే ఉంటాయని చెబుతున్నారు. గులాబ్ కి తండి ఖీర్, ఆచారి సిగార్ రోల్ ప్రత్యేక స్వీట్లుగా పెట్టనున్నారు.
ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ స్పందించారు. రింకు, ప్రియకు సంవత్సరం ముందు నుంచే పరిచయం ఉందని ఆయన గతంలో తెలిపారు. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని పేర్కొన్నారు. ఇక నవంబర్లో జరిగే వీరి వివాహానికి రాజకీయ ప్రముఖులు, సినీ స్టార్లు, క్రికెటర్లు, బిజినెస్మ్యాన్లు భారీ స్థాయిలో హాజరు అవుతారని సమాచారం. కాగా ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు, ఉత్తరప్రదేశ్ నుండి ప్రస్తుత సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే. మరోవైపు ప్రియ సరోజ్ గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని మచిలీషహర్ నుంచి ఎస్పీ పార్టీ తరఫున పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఇకపోతే రింకూ సింగ్ టీమిండియాలో యువ క్రికెటర్గా కొనసాగుతున్నాడు.
Also Read: