Bangalore Stampede: బెంగుళూరు తొక్కిసలాటలో వారికి రూ.25లక్షలు పరిహారం

బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచింది. 11మంది మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

New Update
Bengaluru stampede

బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచింది. మొదట 11మంది మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అనంతరం శనివారం ఎక్స్‌గ్రేషియాని రూ.25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ 2025లో RCB విజయం సాధించింది. దీంతో బెంగుళూర్‌లో విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆర్సీబీ ఆటగాళ్లును చూడటానికి ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. 3లక్షల మంది స్టేడియం వద్దకు వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 11 మంది చనిపోగా..మరో 56 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులతో పాటు పలువురిపై సస్పెన్షన్ వేటు పడింది.

Bengaluru Stampede | Bengaluru Stampede News | latest-telugu-news | exgratia

Advertisment
Advertisment
తాజా కథనాలు