Poverty: ఇండియాలో గణనీయంగా తగ్గిన పేదరికం..వరల్డ్ బ్యాంక్

భారత్ లో గత పదేళ్ళల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని అని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 5.3 శాతానికి తగ్గిందని తాజా ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడించింది. 

New Update
india

Indian Poverty

ప్రధాని మోదీ హయాంలో భారత్ అభివృద్ధి చెందుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రపంచ బ్యాంక్ నివేదికలు చెబుతున్నాయి. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 5.3 శాతానికి తగ్గిందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. 2011-12లో ఇండియాలో 344.47 మిలియన్ల నుంచి 2022-23లో 75.24 మిలియన్లకు పేద ప్రజలు తగ్గారని నివేదికలో వెల్లడించింది. అంటే దాదాపు 11 సంవత్సరాలలో 269 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 

పేదరికం నుంచి బయటపడ్డారు..

2011-12లో భారత్ లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు మధ్యప్రదేశ్ లలో అత్యంత పేదరికంలో 65 శాతం మంది ప్రజలు ఉన్నారు. కానీ  2022-23 నాటికి మూడింట రెండు వంతుల మంది ఇందులో నుంచి బయటపడ్డారు. అంతర్జాతీయ దారిద్య్ర రేఖ (2021 ధరలను ఉపయోగించి) రోజుకు $3.00 ఆధారంగా వరల్డ్ బ్యాంక్ ఈ లెక్కలను వేసింది. ఇక తాజా డేటా ప్రకారం, రోజుకు $2.15 దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్య 2022లో 33.66 మిలియన్లుగా నమోదైంది. ఇది 2011లో 205.93 మిలియన్లుగా ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో పేదరికం తగ్గింది. ఇక్కడ 18.4 శాతంగా ఉన్న ప్రావర్టీ 2.8 అయింది. పట్టణాల్లో అయితే ఈ శాతం 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్లనే ఇది సాధ్యమైందని అంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలతో గృహనిర్మాణం, వంట ఇంధనం, బ్యాంకింగ్ మెరుగుపడ్డాయి. వీటి వల్ల 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికన్నా జయించారని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. 

 

Also Read: Ind-Eng: ఇంగ్లాండ్ టెస్ట్ కు భారత్ షెడ్యూల్ ఇదే..

Advertisment
Advertisment
తాజా కథనాలు