Kavvampally Satyanarayana : పాపం కవ్వంపల్లి

రెండో విడత మంత్రి పదవుల విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి వరించింది. నిజానికి మంత్రివర్గ విస్తరణలో ముందుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి మానకోండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం సాగింది.

New Update
Kavvampally Satyanarayana

Kavvampally Satyanarayana

Kavvampally Satyanarayana : రెండో విడత మంత్రి పదవుల విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి వరించింది. నిజానికి మంత్రివర్గ విస్తరణలో ముందుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి మానకోండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం సాగింది. కానీ చివరినిమిషంలో ఆయనకు మంత్రి పదవి చేజారింది. నిన్నటినుంచి కవ్వంపల్లి కి మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం జోరందుకున్నప్పటికి చివరిక్షణంలో మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
నిరుత్సాహంలో కవ్వంపల్లి..


కాగా మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారడంతో కవ్వంపల్లితో పాటు ఆ నియోజక వర్గ కార్యకర్తలు నిరుత్సాహనికి గురయ్యారు. కవ్వంపల్లి సైతం అసంతృప్తిలో మునిగి పోయినట్లు ఆయన ఆనుచరులు పేర్కొంటున్నారు. కవ్వంపల్లి కి మంత్రి పదవి ఖరారైనట్లు నిన్నటి నుంచి ప్రచారం సాగుతోంది.  దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు జోష్ లోఉన్నారు. ఈ క్రమంలో చివరి క్షణం లో మంత్రి పదవి చేజారడంతో కవ్వంపల్లి నిరుత్సాహంలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉండటం, తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడంవంటి కారణాలతో ఆయనకు చోటు దక్కలేదన్నవాదన వినపడుతోంది.

కలిసి వచ్చిన ఓటమి


అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌ ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌కాంగ్రెస్‌ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. గోదావరిఖనిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఎస్సీ నియోజక వర్గంగా ఉన్న మేడారం ను నియోజకవర్గాల విభజన తర్వాత ధర్మపురికి మార్చారు. దీంతో అడ్లూరి ధర్మపురి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన అంతకు ముందు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. అనంతరం ధర్మపురి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతిలో రెండుసార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొప్పుల ఈశ్వర్‌ గెలుపును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టు వరకు అడ్లూరి పోరాటం చేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన లక్ష్మణ్‌ కుమార్‌కు అనూహ్యంగా మంత్రిపదవి లభించింది. 2009 నుంచి ఎన్నికల నుంచి పోటీ చేస్తున్న లక్ష్మణ్‌ కుమార్‌  ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్‌ స్వల్పతేడాతో ఓడిపోవడం, మొదటి నుంచి పార్టీ విధేయుడిగా ఉండటం, జడ్పీచైర్మన్‌గా, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం, ఎటువంటి ఆరోపణలు లేకపోవడం వంటివి లక్ష్మణ్‌ కుమార్‌కు కలిసి వచ్చాయి. 

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు